News September 3, 2025
KNR: మానేరు రివర్ ఫ్రంట్ పరిశీలించిన కలెక్టర్

మానేరు రివర్ ఫ్రంట్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను ఈ సందర్భంగా ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు భూములు సేకరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు ఉన్నారు.
Similar News
News September 3, 2025
KNR: రేపటి నుంచి వైన్స్ బంద్

వినాయక నిమజ్జనం నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 4వ తేదీ(రేపు) ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి పి.శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం A4 దుకాణాలు, 2B బార్లు, CI క్లబ్స్, కల్లు దుకాణాలు/డిపోలు, మిలిటరీ క్యాంటీన్ & టి.ఎస్.బి.సి.ఎల్ KNR డిపో మూసివేయాలని అదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.
News September 3, 2025
KNR: ‘NH భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి’

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, భారత జాతీయ రహదారి సంస్థ ప్రాంతీయ అధికారి శివశంకర్, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు నాగరాజు, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ మంగళవారం భూసేకరణ సమస్యలపై సమావేశం నిర్వహించారు.
News September 3, 2025
KNR: టీచర్స్ డే.. ఉత్తమ టీచర్లకు అవార్డులు..!

SEPT 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 సెలవు దినం కావడంతో వేడుకలను ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి పురస్కారాలను అందజేయనున్నారు. 43 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.