News June 26, 2024
KNR: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719403791136-normal-WIFI.webp)
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు మచ్చతెచ్చే పనులు చేయవద్దని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అతిథిగా హాజరై మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.
Similar News
News July 1, 2024
సిరిసిల్ల: కానిస్టేబుల్పై హత్యాయత్నం.. వ్యక్తి అరెస్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719809048498-normal-WIFI.webp)
కానిస్టేబుల్పై హత్యాయత్నానికి పాల్పడిన ఇసుక స్మగ్లర్ను పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ ప్రకారం.. రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్కు తరలిస్తున్నారు. ఈక్రమంలో గురుబాబు(30) అనే వ్యక్తి ట్రాక్టర్ను నడిపి చెరువులోకి తోసివేశాడు. కాగా, ఆ సమయంలో ట్రాక్టర్పై కానిస్టేబుల్ సత్యనారాయణ ఉండటంతో తీవ్ర గాయాలయ్యాయి.
News July 1, 2024
జగిత్యాల: నేటి నుంచి నూతన చట్టాలు అమలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719801880070-normal-WIFI.webp)
నేటి నుంచి నూతన చట్టాలు అమలులోకి వస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన న్యాయ, నేర చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. దేశ అంతర్గత భద్రతలో కొత్త చట్టాలు నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసుశాఖకు చెందిన డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
News July 1, 2024
KNR స్మార్ట్సిటీ పనుల పూర్తికి అవకాశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719800708017-normal-WIFI.webp)
స్మార్ట్సిటీ మిషన్ పనుల గడువును వచ్చే మార్చివరకు పొడిగించడంతో KNRలోని పెండింగ్ పనుల పూర్తికి అవకాశముంది. KNR స్మార్ట్సిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.647.32కోట్లతో చేపట్టిన 22 ప్రాజెక్టుల పనులు పూర్తి కాగా.. మరో 23 ప్రాజెక్టులకు రూ.259.79 కోట్లను కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేటాయించింది. దీంతో రహదారులు, మురుగుకాలువలు, ట్రాఫిక్ సిగ్నల్స్, కమాండ్ కంట్రోల్ తదితర పనులు అందుబాటులోకి వచ్చాయి.