News January 30, 2025
KNR: విలీన గ్రామాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

కరీంనగర్ మున్సిపల్ లో విలీనమైన గ్రామాలలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ప్రత్యేక అధికారులతో బుధవారం సందర్శించారు. ఈ సంధర్బంగా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. విలీన గ్రామపంచాయతిలలో నియమించిన ప్రత్యేక అధికారులు అన్ని రికార్డులను ప్రొఫార్మా ప్రకారం తనిఖీ చేసి సీజ్ చేశారని తెలిపారు. విలీన గ్రామాలకు నగరపాలక సంస్థ వార్డుగా బోర్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాల్లో పోలింగ్

కరీంనగర్ జిల్లాలో నేడు రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు.మానకొండూర్ నియోజకవర్గంలోని 113 గ్రామాలకు గాను రెండు ఏకగ్రీవం కాగా, 111 గ్రామాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1046 వార్డుల్లో 197 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 849 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ బరిలో 436 మంది, వార్డు సభ్యులుగా 2275 మంది ఉన్నారు. 1,84,761 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 13, 2025
రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలను పరిశీలించిన KNR సీపీ

కరీంనగర్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ టీవీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు.
News December 13, 2025
ఇందుర్తి: ప్రచారం ముగిసినా ఆన్లైన్ పోల్.. కేసు నమోదు

చిగురుమామిడి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లో ‘మాక్ పోల్’ నిర్వహించిన ఘటనపై కేసు నమోదైంది. ఇందుర్తి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థుల పేర్లతో పోల్ నిర్వహించడం ద్వారా ఎన్నికల నిబంధనలు (MCC) ఉల్లంఘించారని మండల నోడల్ అధికారి ఫిర్యాదు చేశారు. చిగురుమామిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


