News May 5, 2024
KNR: వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మత్తారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పారుపల్లికి చెందిన జెల్ల రాజేశ్వరి(25) కడుపు నొప్పితో భాదపడుతుంది. ఆస్పత్రుల్లో చూపించుకొని, మందులు వాడినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News December 21, 2025
ఈనెల 24 నుంచి ‘కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళా’

కరీంనగర్లో ఈనెల 24 నుంచి 26 వరకు కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించనున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ “కిసాన్ గ్రామీణ మేళా” నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 21, 2025
ముగిసిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

ఉమడి KNR జిల్లా స్థాయి మైనారిటీ బాలికల పాఠశాలల & కళాశాలల క్రీడా పోటీలు KNR జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ పోటీల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల&కళాశాల చొప్పదండి బాలికలు -1, గంగాధర కైవసం చేసుకుంది. ఈ పోటీలకు వివిధ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల&కళాశాల నుంచి దాదాపు 800 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
News December 21, 2025
కరీంనగర్: సోమవారం జరగాల్సిన ‘ప్రజావాణి’ రద్దు

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి ఈ నెల 29 నుంచి ప్రజావాణి యథాతథంగా కొనసాగుతుందని, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.


