News February 22, 2025

KNR: 27 న పోలింగ్.. జోరుగా ఎన్నికల ప్రచారం..!

image

ఈ నెల 27న జరుగబోయే KNR-MDK-NZB-ADLB MLC ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను ఆదేశించడంతో పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పట్టభద్రుల, టీచర్స్ విభాగల్లో ఆయా పార్టీల MLC అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలంటూ లీడర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది.

Similar News

News February 26, 2026

అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం: చుక్కా రాములు

image

అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు.

News February 26, 2026

ప.గో: ఖాళీలు భర్తీ చేయకుంటే ఎలా (2/2)

image

ఉమ్మడి జిల్లా పరిషత్‌ పరిధిలో <<19245662>>ఉద్యోగుల కొరత<<>> పాలనను కుంగదీస్తోంది. 662 పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. వీటిలో కీలకమైన అకౌంట్స్ అధికారి, 13 ఎంపీడీవో, పరిపాలనాధికారి, సీనియర్ అసిస్టెంట్లు, స్టెనోలు, 20 లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు అత్యధికంగా 419 ఆఫీస్ సబార్డినేట్, 177 క్లాస్-4 ఉద్యోగాలు భర్తీకి నోచుకోకపోవడంతో జిల్లా స్థాయిలో పరిపాలన కష్టసాధ్యంగా మారింది.

News February 26, 2026

పశ్చిమగోదావరి జడ్పీలో సిబ్బంది కొరత (1/2)

image

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌, జడ్పీ ఉన్నత పాఠశాలలు, ఎంపీడీవో కార్యాలయాలను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది లేమి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ ప్రసాద్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి సిబ్బంది కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.