News February 22, 2025
KNR: 27 న పోలింగ్.. జోరుగా ఎన్నికల ప్రచారం..!

ఈ నెల 27న జరుగబోయే KNR-MDK-NZB-ADLB MLC ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను ఆదేశించడంతో పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పట్టభద్రుల, టీచర్స్ విభాగల్లో ఆయా పార్టీల MLC అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలంటూ లీడర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది.
Similar News
News December 4, 2025
గోదావరిఖని డిపో DEC టూర్ ప్యాకేజీలు

GDK డిపో DECలో 2 ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. DEC 6న బయలుదేరే కర్ణాటక యాత్రలో హంపి-గోకర్ణ-మురుడేశ్వర-ఉడిపి-శృంగేరి-ధర్మస్థల-కుక్కి సుబ్రమణ్య-మంత్రాలయం దర్శనాలు ఉంటాయి. ఛార్జీలు: పెద్దలు రూ.6600, పిల్లలు రూ.5000. DEC 15న అరుణాచలం- రామేశ్వరం యాత్ర ఉంటుంది. ఇందులో కాణిపాకం- అరుణాచలం- శ్రీరంగం- పలని- మధురై- రామేశ్వరం సహా 10 ముఖ్యక్షేత్రాలు ఉంటాయి. ఛార్జీలు: పెద్దలు రూ.8000, పిల్లలు రూ.6000.
News December 4, 2025
చెల్పూర్, గొర్లవీడు సర్పంచుల బరిలో తాజా మాజీ ఎంపీపీలు..!

జయశంకర్ జిల్లాలో తాజా మాజీ ఎంపీపీలు ఇరువురు సర్పంచ్ బరిలో నిలిచారు. గణపురం మండల తాజా మాజీ ఎంపీపీ కావటి రజిత చెల్పూరు సర్పంచ్, భూపాలపల్లి తాజా మాజీ ఎంపీపీ మందల లావణ్య రెడ్డి గొర్లవీడు సర్పంచ్ బరిలో నిలిచారు. వీరిరువురు మండల స్థాయిలో ఎంపీపీలుగా పనిచేసి జనరల్ మహిళల రిజర్వేషన్ల రావడంతో వారి సొంత గ్రామాల్లో పోటీకి నిలిచారు. అందులో రజిత అధికార కాంగ్రెస్, లావణ్య ప్రతిపక్ష బీఆర్ఎస్లో ఉన్నారు.
News December 4, 2025
ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.


