News February 22, 2025
KNR: 27 న పోలింగ్.. జోరుగా ఎన్నికల ప్రచారం..!

ఈ నెల 27న జరుగబోయే KNR-MDK-NZB-ADLB MLC ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను ఆదేశించడంతో పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పట్టభద్రుల, టీచర్స్ విభాగల్లో ఆయా పార్టీల MLC అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలంటూ లీడర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది.
Similar News
News November 23, 2025
ADB: బీసీలకు 22 నుంచి 26% రిజర్వేషన్లు..!

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు వస్తాయని ఆశించిన బీసీలకు భంగపాటు తప్పలేదు. 50% ఉంచకుండా రిజర్వేషన్లు కల్పించాలంటే బీసీలకు 22 నుంచి 26% స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈరోజు సాయంత్రం వరకు పూర్తవనుంది. జిల్లాలో 20 మండలాలు ఉండగా బీసీలకు 5 + జడ్పీటీసీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
News November 23, 2025
నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.
News November 23, 2025
గోదూరులో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

JGTL(D)లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గోవిందారంలో అత్యల్పంగా 14.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుమలాపూర్లో 15.2, గుల్లకోట 15.3, మల్లాపూర్ 15.4, కథలాపూర్ 15.6, వెల్గటూర్, మల్యాల 15.7, మన్నెగూడెం, ఎండపల్లి 15.8, రాఘవపేట, ఐలాపూర్ 15.9, పెగడపల్లి 16, సారంగాపూర్, మేడిపల్లి, రాయికల్, నెరెళ్ల, కోల్వాయి, పొలాస 16.1, పూడూర్ 16.2, బుద్దేశ్పల్లి, జగ్గాసాగర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.3C°గా నమోదైంది.


