News March 5, 2025
KNR: 53 మంది ఎలిమినేషన్.. బీజేపీకి 4991 లీడ్

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ జరిగింది. అధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. 53వ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత ఫలితాలు..అంజిరెడ్డి (బీజేపీ)- 78635, నరేందర్ రెడ్డి ( కాంగ్రెస్) – 73644, ప్రసన్న హరికృష్ణ (BSP)63404 అంజిరెడ్డి సమీప ప్రత్యర్థి నరేందర్ రెడ్డిపై 4991 లీడ్లో ఉన్నారు.
Similar News
News November 27, 2025
ఎన్నికలకు అవసరమైన బందోబస్తు సిద్ధం: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బందోబస్తు ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకునేలా పోలీసు విభాగం సన్నద్ధమైందన్నారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే తప్పనిసరిగా రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని సూచించారు.
News November 27, 2025
జనగామ: పంచాయతీ ఎన్నికలు.. నిఖిల ఆదేశాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు నిఖిల నోడల్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనగామ జిల్లాకి జనరల్ అబ్జర్వర్గా నిఖిల నియామకమైన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.
News November 27, 2025
SRCL: ‘త్వరలోనే BRSను బొందపెడుతరు’

బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెడతారని, తమ నాయకుడిని విమర్శించే స్థాయి వారికి లేదని లోకల్ బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. మాట్లాడాల్సిన వ్యక్తిని జర్మనీ పంపించి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా అని విమర్శించారు.


