News March 5, 2025

KNR: 53 మంది ఎలిమినేషన్.. బీజేపీకి 4991 లీడ్

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ జరిగింది. అధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. 53వ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత ఫలితాలు..అంజిరెడ్డి (బీజేపీ)- 78635, నరేందర్ రెడ్డి ( కాంగ్రెస్) – 73644, ప్రసన్న హరికృష్ణ (BSP)63404 అంజిరెడ్డి సమీప ప్రత్యర్థి నరేందర్ రెడ్డిపై 4991 లీడ్‌లో ఉన్నారు. 

Similar News

News December 5, 2025

సంక్రాంతి బరిలో బాలకృష్ణ?

image

అనివార్య కారణాలతో బాలకృష్ణ అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే మరో మూడు వారాలు ఆగితే సంక్రాంతి ఫీవర్ వచ్చేస్తుంది. వరుస సెలవులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంటుంది. ఈ క్రమంలో సినిమాకు వచ్చిన అడ్డంకులు తొలగించుకుని వాయిదా పడిన అఖండ-2ను సంక్రాంతి బరిలో నిలిపే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అటు చిరంజీవి, ప్రభాస్‌తో సహా పలువురి సినిమాలు జనవరిలో రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.

News December 5, 2025

శుక్రవారం రోజున ఉప్పు కొంటున్నారా?

image

ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. అలాగే శుక్రవారమన్నా అమ్మవారికి ఇష్టమే. అందుకే శుక్రవారం రోజున ఉప్పు కొంటే చేసిన అప్పులు త్వరగా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలుగుతాయని అంటున్నారు. ‘సంపాదనలో భాగంగా మొదటి ఖర్చును ఉప్పుపైనే పెట్టడం ఎంతో శుభకరం. శుక్రవారం రోజున ఉప్పు కొంటే దారిద్ర్యం తొలగిపోతుంది. మంగళ, శని వారాల్లో ఉప్పు కొనకూడదు’ అని సూచిస్తున్నారు.

News December 5, 2025

బ్యాంక్ కోచింగ్‌కు వెళ్లిన భార్య.. భర్త సూసైడ్

image

అగలిలోని ఇందిరమ్మ కాలనీలో మహాలింగ(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల మేరకు.. వెల్డింగ్ కార్మికుడిగా పనిచేసే మహాలింగ భార్య బ్యాంక్ కోచింగ్ కోసం నంద్యాలకు వెళ్లడంతో ఒంటరితనానికి లోనై ఈ ఘటనకు పాల్పడ్డాడు. తమ్ముడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.