News February 27, 2025
KNR: MLC ఓటు ఎలా వేయాలో తెలుసా..?

✓మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు, ఫోటోస్ ఉంటాయి✓మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి ఎదురుగా ఉన్న బాక్సులో 1వ నంబర్ వేయాలి✓ఇతరులకు కూడా మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు కూడా వేయవచ్చు✓పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి✓వెళ్ళేటపుడు మీ ఐడీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి✓బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి✓బూత్ బయట ఓటర్ లిస్టులో మీ పేరు, క్రమ సంఖ్య చూసుకోండి.
Similar News
News November 13, 2025
ఊట్కూర్: రూ.3.91కోట్ల అవకతవకలు.. ఐదుగురి అరెస్ట్

ఉట్కూర్లోని SBI బ్యాంక్లో 2016–2019 మధ్య నకిలీ పట్టా పాస్బుక్స్ ఆధారంగా 414 ఖాతాల్లో సుమారు రూ.3.91 కోట్లు మోసం చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బ్యాంక్ మేనేజర్ SR నాగరాజు, క్యాషియర్ మంత నరేష్, మధ్యవర్తులు పూడూరు సత్యనారాయణ, మలీ పటేల్ సోమిరెడ్డి, కుర్మిరెడ్డిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. మరికొంతమంది ప్రమేయంపై విచారణ జరుగుతోందని CI తెలిపారు.
News November 13, 2025
TG TET షెడ్యూల్ విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.
News November 13, 2025
పచ్చిరొట్టగా పెసర/మినుముతో సాగుకు లాభం

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.


