News October 27, 2025
KNR: NOV 3న అరుణాచలానికి ప్రత్యేక బస్సు

KNR నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు KNR 1 DM విజయమాధురి తెలిపారు. NOV 3న KNR బస్టాండ్ నుంచి సా.4 గంటలకు బయలుదేరి NOV 4న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం NOV 5న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత NOV 6న సాయంత్రం వరకు బస్సు KNRకు చేరుకుంటుందని చెప్పారు. వివరాలకు 9959225920ను సంప్రదించాలన్నారు.
Similar News
News October 27, 2025
మొదటిసారిగా కరీంనగర్లో..!

కరీంనగర్లో మొదటిసారిగా ఏ- డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్ జరగనుంది. అలుగునూరులోని వెల్చల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ చారిత్రాత్మక పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో హైదరాబాద్ వెలుపల అధికారిక ఏ- లెవల్ లీగ్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే తొలి జిల్లాగా కరీంనగర్ నిలిచింది.
News October 26, 2025
కరీంనగర్: రేపటి ప్రజావాణి రద్దు.. ఎందుకంటే..?

కరీంనగర్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్కు సంబంధించిన లాటరీ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.
News October 26, 2025
కరీంనగర్ మహాసభకు ‘తరలిన శ్రీనివాసులు’

చొప్పదండి మండలం నుంచి శ్రీనివాస నామదేయ మిత్రులు ఆదివారం పెద్దసంఖ్యలో KNRలో జరుగుతున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వార్షికోత్సవ మహాసభకు తరలివెళ్లారు. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ సభకు వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వార్షికోత్సవ మహాసభ సందర్భంగా తలసేమియా బాధితులకు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


