News May 31, 2024
KNR: అధికారిని బురిడీ కొట్టించిన తల్లీకూతుళ్లు
ఓ ప్రభుత్వ అధికారిని తల్లీకూతుళ్లు మోసం చేసిన ఘటన గోదావరిఖనిలో జరిగింది. శ్రీరాంపూర్కి చెందిన ఓ సింగరేణి అధికారికి అదే ప్రాంతానికి చెందిన శ్రీలత, భవానీ పరిచయమయ్యారు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని కాజేయాలని శ్రీలత భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పథకం వేశారు. అతడి వద్దకు భవానీని పంపించి వారిద్దరు కలిసి ఉండగా పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి 9 తు. బంగారం, రూ.1.90లక్షల నగదు, రూ.20 లక్షల చెక్కు రాయించుకున్నారు.
Similar News
News September 30, 2024
KNR: కాసేపట్లో DSC ఫలితాలు.. అభ్యర్థులు వీరే!
DSC ఫలితాలు కాసపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో SGT పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ నిష్పత్తి
KNR 1086 90 (1:12)
PDPL 549 14 (1:39)
JGTL 1248 136 (1:09)
SRCL 1043 64 (1:16)
News September 29, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ జగిత్యాలలో జానపద గాయకుడు మల్లిక్ తేజ పై కేసు. @ రాయికల్ మండలంలో జ్వరంతో బాలిక మృతి. @ శంకరపట్నం మండలంలో కారు బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ బెజ్జంకి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. @ మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్యకు డాక్టరేట్. @ రాయికల్ ఎస్సైగా సుధీర్ రావు బాధ్యతల స్వీకరణ. @ కరీంనగర్ లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభం.
News September 29, 2024
జగిత్యాల: దసరా కానుకగా వెరైటీ లక్కీ డ్రా
జగిత్యాల జిల్లా భీమారం మండలంలో దసరా సందర్భంగా పలువురు యువకులు వెరైటీ లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో 12 రకాల ఆఫర్లు పెట్టారు. రూ.100తో లక్కీ డ్రా తీస్తే మొదటి బహుమతిగా 2 కిలోల మటన్, రెండో బహుమతిగా మేక తల, మూడో బహుమతి నాటుకోడి పుంజు, ఇలా.. కోడిగుడ్లు, బీరు, విస్కీ, బట్టలు అంటూ 12 రకాల ఆఫర్స్ ఏర్పాటు చేశారు. అక్టోబర్ 11న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.