News March 20, 2025
KNR: ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

కరీంనగర్ కమిషనర్ పరిధిలోని రూరల్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తనిఖీ చేశారు. డివిజన్ పరిధి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక దిగా ఏర్పాటు చేయాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలలో అవగాహన పెంచాలని తెలిపారు.
Similar News
News March 28, 2025
కరీంనగర్: UDID కార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

దివ్యాంగులకు జారీ చేయనున్న UDIDకార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య, ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని UDIDకార్డుల వైద్య పరీక్షల విభాగాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. UDIDకార్డుల జారీలో భాగంగా వైద్య పరీక్షలకు వచ్చే దివ్యాంగులకు వసతులు కల్పించాలన్నారు. ర్యాంపు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.
News March 28, 2025
కరీంనగర్: ధాన్యం కొనుగోలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను 150కి పెంచుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నగరంలోని స్వశక్తి భవన్లో శుక్రవారం నిర్వహించారు. కొనుగోళ్ల పట్ల ఏపీఎంలు, సెంటర్ ఇన్చార్జులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు నమోదు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని పేర్కొన్నారు.
News March 28, 2025
రామడుగు: శుక్రవారం సభ పరిష్కారాల వేదిక: కలెక్టర్

శుక్రవారం సభ ఒక పరిష్కారం లాంటిదని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అన్నారు. శుక్రవారం రామడుగు మండలంలోని కొక్కేరకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. శుక్రవారం సభ ద్వారా పలు సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంపీడీవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.