News May 1, 2024

KNR: సీఎం సభకు వెళ్లి.. వడదెబ్బతో మహిళ మృతి

image

జమ్మికుంటలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభకు వెళ్లి వడదెబ్బతో మహిళ మృతి చెందిన ఘటన వీణవంక మండలం రెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ జనజాతర సభకు మంగళవారం వెళ్లారు. ఈ క్రమంలో ఆమె వడదెబ్బకు గురయ్యారు. దీంతో ఆమె మృతిచెందారు. వారి కుటుంబసభ్యులను హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ప్రణవ్ పరామర్శించారు. కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా ఆదుకుంటామన్నారు.

Similar News

News April 25, 2025

కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.

News April 25, 2025

కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.

News April 25, 2025

జగిత్యాల: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన JGTL పట్టణంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. JGTL(D) పోచమ్మ వాడకు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రసన్నలక్ష్మి(28), వెల్గటూర్(M)రాంనుర్‌కు చెందిన గాంధారి తిరుపతికి 2023లో వివాహమైంది. వీరికి సంవత్సరం బాబు ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె గురువారం ఇంట్లో ‘సారీ నాన్న.. నాకు బతకాలని లేదు’ అని అద్దంపై రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

error: Content is protected !!