News December 14, 2024

ఫుడ్ షేర్ చేసుకున్న కోహ్లీ, కేఎల్ రాహుల్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు వర్షం వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా డగౌట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఇద్దరూ లంచ్ బ్రేక్‌లో ఫుడ్ షేర్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బాక్స్‌లోని ఫుడ్ తింటూ కనిపించారు. కాగా ఇవాళ మ్యాచ్ తిరిగి ప్రారంభం కావడం అనుమానమే.

Similar News

News February 5, 2025

తండ్రి అయ్యేందుకు 11వేల కి.మీలు ప్రయాణం

image

దక్షిణ చిలీలోని ‘పార్క్ టంటాకో’ అటవీ ప్రాంతాల్లో ఉండే డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో గుర్తించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్‌లో మగ కప్పలను యూకేకు తరలించారు. దీనికోసం బోటు, విమానం, కారులో ఇలా 11వేల కి.మీలకు పైగా ప్రయాణించాయి. ఎట్టకేలకు ఈ అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలు జన్మనిచ్చాయి. ఇవి 2గ్రాముల కంటే తక్కువ బరువుంటాయి.

News February 5, 2025

విడదల రజినీపై కేసుకు హైకోర్టు ఆదేశం

image

AP: మాజీ మంత్రి విడదల రజినీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపాలని పేర్కొంది. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రజినీపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

News February 5, 2025

కొత్త జెర్సీలో భారత ప్లేయర్లు

image

ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. కొత్త జెర్సీతో టీమ్ సభ్యులు దిగిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. భుజాల వద్ద జాతీయ జెండా రంగు పెద్దగా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. ఎంతో స్టైలిష్ & క్లాసీ లుక్‌తో ఉన్న జెర్సీలో మన ప్లేయర్లు అదిరిపోయారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేపు విదర్భ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.

error: Content is protected !!