News May 12, 2024
కోహ్లీ-అనుష్క డిన్నర్ డేట్

ఐపీఎల్ మ్యాచ్లతో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ నిన్న రాత్రి తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి డిన్నర్ డేట్కు వెళ్లారు. బ్లాక్ ఔట్ఫిట్తో వీరు బెంగళూరులోని ఓ రెస్టారెంట్కు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరి క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్కు వెళ్లారు. ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి వామిక, అకాయ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


