News May 12, 2024
కోహ్లీ-అనుష్క డిన్నర్ డేట్

ఐపీఎల్ మ్యాచ్లతో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ నిన్న రాత్రి తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి డిన్నర్ డేట్కు వెళ్లారు. బ్లాక్ ఔట్ఫిట్తో వీరు బెంగళూరులోని ఓ రెస్టారెంట్కు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరి క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్కు వెళ్లారు. ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి వామిక, అకాయ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
Similar News
News October 27, 2025
డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా

యంగ్ ప్లేయర్ పృథ్వీ షా రంజీలో డబుల్ సెంచరీ బాదారు. ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో మహారాష్ట్ర తరఫున 144 బంతుల్లోనే 200 మార్క్ దాటారు. ఇది రంజీ హిస్టరీ ఎలైట్ గ్రూప్లో సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కావడం విశేషం. 29 ఫోర్లు, 5 సిక్సర్లతో 156 బంతుల్లో 222 రన్స్ చేశారు. ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో జాతీయ జట్టుకు దూరమైన షా దేశవాళీల్లో రాణిస్తున్నారు.
News October 27, 2025
BC ఓటు బ్యాంకుపైనే RJD గురి

బిహార్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ NDA, MGBల మధ్యే ఉంది. మహాఘట్బంధన్లో కీలకమైన RJD BC ఓట్లపై గురిపెట్టింది. పోటీచేస్తున్న143 స్థానాల్లో 51% సీట్లు BCలకు కేటాయించింది. ఇందులో 53సీట్లు యాదవులవే. EBCలకు 11% ముస్లింలకు 13% అగ్రవర్ణాలకు 10% సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడంతో ఈబీసీల సంఖ్య ఈసారి తగ్గించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది.
News October 27, 2025
భారీ వర్షాలు.. చామంతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అధిక వర్షాల వల్ల చామంతిలో వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. పంటలో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపాలి. వేరుకుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా విడోమిల్ ఎంజడ్ 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మరియు మ్యాంకోజబ్ 2.5 గ్రా. లేదా లీటరు నీటికి హెక్సాకోనోజోల్ 2ml కలిపి పిచికారీ చేయాలి.


