News December 12, 2024
బ్రిస్బేన్ హోటల్లో కోహ్లీ-అనుష్క!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట తమ ఏడో వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ హోటల్లో జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటో వైరలవుతోంది. ప్రస్తుతం కోహ్లీ BGT కోసం జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు చేరుకోగా మూడో టెస్టు కోసం సన్నద్ధం అవుతున్నారు. వెడ్డింగ్ డే కావడంతో టీమ్కు దూరంగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు. 2017 డిసెంబర్ 11న వీరిద్దరి ప్రేమ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News February 2, 2026
జనవరిలో రికార్డు స్థాయి UPI లావాదేవీలు

జనవరి నెలలో దేశంలో UPI లావాదేవీలు రూ.28.33 లక్షల కోట్లకు చేరుకొని రికార్డు సృష్టించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. సంఖ్యాపరంగా చూస్తే 21.70 బిలియన్లుగా నమోదయ్యాయని తెలిపింది. డిసెంబర్ నెలలో నమోదైన రూ.27.97 లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువ.
News February 2, 2026
కాళ్లు తెల్లగా అవ్వాలంటే..

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి. బయటికి వెళ్లేటపుడు సన్స్క్రీన్ రాయాలి. లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, విటమిన్ సి, హైడ్రోక్వినోన్లలో ఏదో ఒకటి ఉన్న లైటెనింగ్ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.
News February 2, 2026
పాక్ ఉక్కిరిబిక్కిరి.. మహిళలే సూసైడ్ బాంబర్లుగా మారారు!

పాకిస్థాన్ అధీనంలోని బలూచిస్థాన్లో ఉద్రిక్తతలు చల్లారట్లేదు. పాక్ సైన్యంపై రెబల్స్ విరుచుకుపడుతున్నారు. మహిళలు సూసైడ్ బాంబర్లుగా మారి పాక్ సైన్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆసిఫా మెంగల్ (24) అనే సూసైడ్ బాంబర్, మరో మహిళా ఫైటర్ చేసిన దాడుల్లో 50 మంది చనిపోగా అందులో 17 మందికిపైగా పాక్ జవాన్లు ఉన్నారు. 200 మంది పాక్ జవాన్లను చంపామని, 17 మందిని బంధించామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.


