News July 19, 2024

గంభీర్ విషయంలో బోర్డుకు కోహ్లీ భరోసా

image

గంభీర్, కోహ్లీ ఇటీవల కలిసిపోయినట్లు కనిపిస్తున్నా టీం ఇండియాకు సంబంధించి ఒకే ఒరలో ఈ రెండు కత్తులు ఎలా కలిసుంటాయా అన్న అనుమానాలున్నాయి. బీసీసీఐ పెద్దలు కూడా ఇదే మీమాంసలో ఉండగా, ఏం పర్లేదంటూ కోహ్లీ వారికి చెప్పారట. ‘గంభీర్‌తో జరిగిన గత ఘటనలేవీ మా బంధంపై ప్రభావం చూపించవు. ఇద్దరం కలిసి భారత జట్టుకోసమే శ్రమిస్తాం. ఇందులో ఎటువంటి భయాలూ అక్కర్లేదు’ అని విరాట్ చెప్పారని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

Similar News

News September 3, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: ఖమ్మంలో పర్యటించిన సీఎం రేవంత్.. బాధితులకు పరిహారం పెంపు
* ఖమ్మం ప్రజలంతా ధైర్యంగా ఉండండి: టీజీ మంత్రులు
* BRS విజన్‌తోనే మరింత మెరుగ్గా హైదరాబాద్: KTR
* AP: సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే సహించం: CBN
* ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో 11.41 లక్షల క్యూసెక్కుల వరద
* బ్యారేజికి ఎలాంటి ముప్పు లేదు: మంత్రి నిమ్మల
* విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన జగన్

News September 3, 2024

72 ఏళ్ల బామ్మ అకౌంట్ నుంచి రూ.72 లక్షలు కాజేశారు

image

RBI, CBI పేర్లు చెప్పి ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసానికి గురై కేర‌ళ‌కు చెందిన 72 ఏళ్ల బామ్మ రూ.72 ల‌క్ష‌లు మోసపోయింది. RBI నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని ప‌రిచ‌యం చేసుకొని క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందని ఒకరు, సీబీఐ అని చెప్పి మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ మరొకరు ఫోన్ చేసి ఆమెను భయపెట్టారు. ఈ క్ర‌మంలో బామ్మ బ్యాంక్ వివ‌రాలు సేక‌రించిన కేటుగాళ్లు ఆమె అకౌంట్లోని రూ.72 ల‌క్ష‌లు కాజేశారు.

News September 3, 2024

ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఎప్పుడంటే?

image

హైదరాబాద్‌లో ఈనెల 17న వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆరోజు ఖైరతాబాద్ వినాయకుడు హుస్సేన్‌సాగర్‌లోని గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈనెల 7న వినాయక చవితి పండగ కాగా ఈసారి ఖైరతాబాద్‌లో 70 అడుగుల సప్తముఖ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.