News April 21, 2024
కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు

పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ కొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచారు. 79 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత అందుకున్నారు. 81 ఇన్నింగ్సుల్లో ఈ మైలురాయిని చేరుకున్న కోహ్లీ, బాబర్లను రిజ్వాన్ వెనక్కి నెట్టారు. నిన్న కివీస్తో మ్యాచులో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో 3వేల పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్ రిజ్వాన్.
Similar News
News March 14, 2026
ట్రంప్.. వాటిని బూడిద చేస్తాం: IRGC

ఖర్గ్ ద్వీపంలోని (ఇరాన్) ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ <<19377504>>హెచ్చరికపై<<>> IRGC దీటుగా స్పందించింది. ‘ఉగ్రవాది ట్రంప్ ఇరాన్ ఆయిల్, ఎనర్జీ, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తామని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అలా చేస్తే అమెరికా భాగస్వామ్యం ఉన్న అన్ని ఆయిల్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై అటాక్ చేస్తామని ఇదివరకే హెచ్చరించాం. వాటిని బూడిద చేసేస్తాం’ అని హెచ్చరించింది.
News March 14, 2026
చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.
News March 14, 2026
తిరుమలలో నిత్యం కల్యాణమే..

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.


