News February 24, 2025
చరిత్ర సృష్టించిన కోహ్లీ

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీతో చెలరేగి POTM పొందిన విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ICC ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక(5) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఛేజ్ మాస్టర్ 2012 T20WC, 2015 ODI WC, 2016 T20WC, 2022 T20WC, 2025 CTలో దాయాదిపై POTM పొందారు. మరే ఇతర ప్లేయర్ ప్రత్యర్థి జట్టుపై 3 కంటే ఎక్కువ అవార్డులు సాధించకపోవడం గమనార్హం.
Similar News
News February 24, 2025
CM రిలీఫ్ ఫండ్ కోసం కావాల్సినవి!

ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏయే సర్టిఫికెట్లు కావాలో చాలా మందికి తెలియదు. దీనికోసం ఫైనల్ బిల్స్, ఎసెన్షియల్ సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్స్, డిశ్చార్జ్ సమ్మరీ, ఇన్ పేషెంట్ బిల్, సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్, ఆధార్ కార్డు& బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ & రేషన్ కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు కావాలి. వీటిని స్థానిక MLAకు అందించాలి. SHARE IT
News February 24, 2025
వారికి క్షమాపణలు చెప్పిన ‘ఛావా’ డైరెక్టర్

‘ఛావా’ సినిమాలో తమ పూర్వీకులు గనోజీ, కన్హాజీ షిర్కేను అవమానించారనే వారసుల ఆరోపణలపై దర్శకుడు లక్ష్మణ్ ఉటెకర్ స్పందించారు. తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని చెప్పారు. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలని కోరారు. అంతకుముందు సినిమాలో తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశారని రూ.100 కోట్ల పరువు నష్టం వేస్తామని షిర్కే వారసులు దర్శకుడిని హెచ్చరించారు. మరోవైపు ఛావా థియేటర్లలో హిట్ టాక్తో దూసుకెళ్తోంది.
News February 24, 2025
ఖజానా ఖాళీ..! డబ్బులు ఇల్లె..!!

దేశంలో ఇటీవల కొత్తగా ముఖ్యమంత్రులు అయిన వారంతా చెబుతున్న మాటలివి. పథకాలు అమలు చేద్దామన్నా, ఆర్థికపర నిర్ణయాలు తీసుకుందామన్నా ఖజానా ఖాళీ అయింది అని మొన్న తెలంగాణ సీఎం రేవంత్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు, నేడు ఢిల్లీ సీఎం రేఖ అంటున్నారు. ఇందుకు చెప్పే కామన్ కారణం గత పాలకుల నిర్ణయాలు. రేపటి పాలకులు ఈ మాట చెప్పొద్దంటే కనీస అవసరాలు కాని ఉచితాలు ఆపేయడమే పరిష్కార మార్గం. నేతలు ఈ నిర్ణయం తీసుకోగలరా?