News April 3, 2025

గిల్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!

image

నిన్నటి మ్యాచులో ఆర్సీబీపై విజయం తర్వాత గుజరాత్ కెప్టెన్ గిల్ చేసిన పోస్ట్ కోహ్లీ ఫ్యాన్స్‌‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. మ్యాచ్ అనంతరం ‘అరవడంపై కాదు ఆట మీదే మా ధ్యాసంతా’ అని గిల్ ట్వీట్ చేశారు. అంతకుముందు గిల్ ఔటయ్యాక కోహ్లీ బిగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిని ఉద్దేశించే గిల్ పోస్ట్ చేశారని, టీమ్ ఇండియాలో మోస్ట్ ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఆయనే అంటూ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Similar News

News October 25, 2025

AIIMS రాయ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

image

<>AIIMS <<>>రాయ్‌పూర్ 29 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతగల అభ్యర్థులు ఎల్లుండి వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in

News October 25, 2025

హైదరాబాద్‌లో స్టార్‌లింక్ ఎర్త్ స్టేషన్?

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ మన దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా దేశంలోని 9 సిటీల్లో ఎర్త్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్, ముంబై, నోయిడా, చండీగఢ్, కోల్‌కతా, లక్నో తదితర నగరాలు ఈ లిస్టులో ఉన్నాయని సమాచారం. జాతీయ భద్రత దృష్ట్యా టెస్టింగ్ దశలో స్టార్‌లింక్‌కు కఠిన ఆంక్షలతో కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చింది.

News October 25, 2025

తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

image

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.