News September 12, 2024
చరిత్ర సృష్టించేందుకు 58 రన్స్ దూరంలో కోహ్లీ

క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు సమీపంలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్లో 26,952 పరుగులు చేశారు. మరో 58 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్స్లో 27వేల పరుగుల్ని చేరుకున్న తొలి ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్(623 ఇన్నింగ్స్) పేరిట ఆ రికార్డు ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో సచిన్, పాంటింగ్, సంగక్కర మాత్రమే 27వేలకు పైగా రన్స్ చేశారు.
Similar News
News October 24, 2025
APSRTCలో 277 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

APSRTCలో 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కర్నూలు(46), నంద్యాల(43), అనంతపురం(50), శ్రీ సత్యసాయి(34), కడప(60), అన్నమయ్య(44) జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.118. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://apsrtc.ap.gov.in/
News October 24, 2025
నేడు, రేపు భారీ వర్షాలు!

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, NGKL, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారితే.. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సున్నట్లు పేర్కొంది.
News October 24, 2025
మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి.. వైద్య సేవలకు ఆదేశం

AP: తెల్లవారుజామున కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం అత్యంత విషాదకరమని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. ‘పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి వైద్యసేవలు అందించాల్సిందిగా కర్నూలు GGH సూపరింటెండెంట్ను ఆదేశించాను. FSL టీమ్లను సంఘటనాస్థలికి పంపించాం’ అని తెలిపారు.


