News February 24, 2025
కోహ్లీ ఊచకోత.. పాకిస్థానీ ట్వీట్ వైరల్!

పాకిస్థాన్తో మ్యాచ్ అనగానే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పూనకంతో సెంచరీల మోత మోగిస్తుంటారు. నిన్న కూడా CTలో పాకిస్థాన్తో మ్యాచులో సెంచరీతో ఇండియాను గెలిపించారు. అయితే, కోహ్లీ బ్యాటింగ్పై ఓ పాకిస్థానీ తన ఆవేదనను వెళ్లగక్కారు. ‘ఈ విరాట్ కోహ్లీ ఎప్పుడూ మనపైనే ఎందుకు ఎక్కువ కసిగా ఆడతాడు. మనం అతడిని ఏమైనా బాధపెట్టామా? మనమేం చేశాం’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి మీరు COMMENTలో సమాధానం చెప్పండి.
Similar News
News October 16, 2025
WWC25: సెమీ ఫైనల్కు ఆస్ట్రేలియా

ఉమెన్స్ ODI WC-2025లో సెమీ ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇవాళ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత BAN 198/9 స్కోర్ చేయగా, AUS 24.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది. అలీసా హీలీ(113) సెంచరీతో మెరిశారు. లిచ్ఫీల్డ్(84) హాఫ్ సెంచరీ చేశారు. ఈ ఇన్నింగ్స్లో హీలీ 20 ఫోర్లు బాదడం విశేషం. కాగా భారత్పై మ్యాచులోనూ హీలీ(142) అద్భుత సెంచరీ చేశారు.
News October 16, 2025
8th పే కమిషన్ సిఫార్సులు మరింత ఆలస్యం!

కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు ఆలస్యం కావొచ్చు. కమిషన్ను కేంద్రం JANలో ప్రకటించినా విధివిధానాలు తేల్చలేదు. పదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలు సవరించాలి. 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు కాగా సిఫార్సులు 2016లో అమల్లోకొచ్చాయి. ప్రస్తుత కమిషన్ సిఫార్సులు 2026లో అమల్లోకి రావాలి. కానీ 2027లో కూడా అమలు కాకపోవచ్చని ‘కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్’ పేర్కొంది. ఫిట్మెంటు 1.8xగా ఉండొచ్చని అంచనా వేసింది.
News October 16, 2025
విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.