News July 1, 2024
కోహ్లీని బౌలర్లే కాపాడారు: సంజయ్ మంజ్రేకర్

టీ20 WC ఫైనల్లో POTM అవార్డు కోహ్లీకి బదులుగా బౌలర్లకు ఇవ్వాల్సిందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నింగ్స్లో సగం ఓవర్లు ఆడిన విరాట్ 128SRతో మాత్రమే బ్యాటింగ్ చేశారని, దీని వల్ల హార్దిక్ లాంటి హిట్టర్కు 2 బాల్స్ మాత్రమే ఆడే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. మ్యాచ్ ఓడిపోతే కోహ్లీపై విమర్శలు వచ్చేవని, కానీ బౌలర్లు అద్భుతంగా రాణించి అతడిని కాపాడారని చెప్పుకొచ్చారు.
Similar News
News November 29, 2025
భద్రాద్రి జిల్లాలో రెండో రోజు 116 సర్పంచ్ నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు శుక్రవారం 116 మంది సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 1436 వార్డులకు గాను 370 మంది వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
News November 29, 2025
భద్రాద్రి జిల్లాలో రెండో రోజు 116 సర్పంచ్ నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు శుక్రవారం 116 మంది సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 1436 వార్డులకు గాను 370 మంది వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
News November 29, 2025
సివిల్స్ ప్రిపరేషన్.. నార్నూర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

నార్నూర్ గ్రామ పంచాయతీ రాజకీయాల్లో నూతన ఒరవడి ప్రారంభమైంది. అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి, సివిల్స్ కోసం సిద్ధమవుతున్న ఉన్నత విద్యావంతురాలు బాణోత్ కావేరి సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె బరిలో దిగుతున్నారు. మాజీ సర్పంచ్ బాణోత్ గజానంద్ నాయక్ కుమార్తె అయిన కావేరి, గ్రామస్థులతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు.


