News July 1, 2024

కోహ్లీని బౌలర్లే కాపాడారు: సంజయ్ మంజ్రేకర్

image

టీ20 WC ఫైనల్‌లో POTM అవార్డు కోహ్లీకి బదులుగా బౌలర్లకు ఇవ్వాల్సిందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ఆడిన విరాట్ 128SRతో మాత్రమే బ్యాటింగ్ చేశారని, దీని వల్ల హార్దిక్ లాంటి హిట్టర్‌కు 2 బాల్స్ మాత్రమే ఆడే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. మ్యాచ్ ఓడిపోతే కోహ్లీపై విమర్శలు వచ్చేవని, కానీ బౌలర్లు అద్భుతంగా రాణించి అతడిని కాపాడారని చెప్పుకొచ్చారు.

Similar News

News November 17, 2025

తెనాలి: విషాద ఘటనలు.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

image

తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెనాలి నాజరుపేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పవన్ తేజ (24) ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి మందలించగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో కొల్లిపర మండలం జముడుబాడుపాలెంకి చెందిన విద్యార్థిని లావణ్య (20) అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉరి వేసుకొని చనిపోయింది. ఈ రెండు ఘటనలపై వన్‌టౌన్, కొల్లిపర పోలీసులు కేసులు నమోదు చేశారు.

News November 17, 2025

సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

image

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.