News October 27, 2024
ఐదేళ్లలో కోహ్లీ చేసింది 2 సెంచరీలే: ఆకాశ్ చోప్రా

విరాట్ కోహ్లీ ఫామ్పై భారత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా విమర్శలు కురిపించారు. ‘టెస్టుల్లో విరాట్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. గడచిన ఐదేళ్లలో 2 సెంచరీలు మాత్రమే చేశారు. సగటు చూస్తే 2020లో 19, 2021లో 28, 2022లో 26గా ఉంది. గత ఏడాది రెండు సెంచరీలు చేసినా అందులో ఒకటి అహ్మదాబాద్లోని నిర్జీవమైన పిచ్పై వచ్చింది. ఇక ఈ ఏడాది 8 ఇన్నింగ్స్ ఆడినా సగటు 32గానే ఉంది’ అని పెదవి విరిచారు.
Similar News
News October 17, 2025
జనగణన.. వచ్చేనెల ఇళ్ల లెక్కింపు

దేశంలో జనగణన కసరత్తు మొదలైంది. NOV 10-30 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏరియాల్లో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ చేపట్టనున్నారు. 2027లో జనగణన తొలిదశ జరగనుంది. దేశాభివృద్ధి, ప్రజల పరిస్థితులు తెలుసుకునేందుకు దీన్ని నిర్వహిస్తారు. ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందిస్తారు. దేశంలో 1872 నుంచి జనగణన చేస్తుండగా చివరిసారి 2011లో జరిగింది.
News October 17, 2025
విడిపోయినా కలవొచ్చు..

హిందూ వివాహ చట్టం-1955, సెక్షన్-9 ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి వివాహ బంధాన్ని పునరుద్ధరింపజేయమని కోరవచ్చు. సెక్షన్-10 ప్రకారం బంధం చెడకుండా విడివిడిగా ఉండటానికి న్యాయస్థానం ద్వారా అనుమతి కోరవచ్చు. న్యాయసేవల అధికారిక చట్టం ద్వారా స్త్రీలు, పిల్లలు ఉచిత న్యాయసేవలను పొందొచ్చు. ఎవరైనా మహిళను విచారణ జరిపేటప్పుడు ఆమె నివాసంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరపాలి.
News October 17, 2025
‘దేవుడివి సామీ’.. మహేశ్బాబుపై ప్రశంసలు

సూపర్స్టార్ మహేశ్బాబు తన ఫౌండేషన్ ద్వారా చేయిస్తోన్న ఉచిత గుండె ఆపరేషన్ల సంఖ్య తాజాగా 5వేలకు చేరింది. ఈ విషయాన్ని అభిమానులు పోస్ట్ చేస్తూ ‘దేవుడు’ అంటూ కొనియాడుతున్నారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ‘మహేశ్బాబు ఫౌండేషన్’లో <