News October 27, 2024
ఐదేళ్లలో కోహ్లీ చేసింది 2 సెంచరీలే: ఆకాశ్ చోప్రా

విరాట్ కోహ్లీ ఫామ్పై భారత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా విమర్శలు కురిపించారు. ‘టెస్టుల్లో విరాట్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. గడచిన ఐదేళ్లలో 2 సెంచరీలు మాత్రమే చేశారు. సగటు చూస్తే 2020లో 19, 2021లో 28, 2022లో 26గా ఉంది. గత ఏడాది రెండు సెంచరీలు చేసినా అందులో ఒకటి అహ్మదాబాద్లోని నిర్జీవమైన పిచ్పై వచ్చింది. ఇక ఈ ఏడాది 8 ఇన్నింగ్స్ ఆడినా సగటు 32గానే ఉంది’ అని పెదవి విరిచారు.
Similar News
News November 21, 2025
iBOMMA రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి ఏమన్నారంటే?

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదించి అతన్ని బయటకు తీసుకొస్తానంటూ సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో ఉంటున్న రవి తండ్రి అప్పారావును ఆయన కలిశారు. కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా తాను నిరాకరించినట్లు అప్పారావు తెలిపారు. తన ఆరోగ్యం సహకరించనందున కోర్టుల చుట్టూ తిరగలేనని చెప్పానన్నారు.
News November 21, 2025
తిరుమల: సర్వదర్శనానికి 8 గంటల టైమ్

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 66,839 మంది దర్శించుకోగా, 19,220 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.61 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
News November 21, 2025
విశాఖలో ‘కాగ్నిజెంట్’.. JAN నుంచి కార్యకలాపాలు!

AP: దిగ్గజ IT కంపెనీ కాగ్నిజెంట్ వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో తొలుత డెలివరీ సెంటర్ను 800 మంది ఉద్యోగులతో ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇతర కాగ్నిజెంట్ సెంటర్లలో పనిచేసే కొందరిని ఇక్కడికి తరలించనుంది. కాగా ప్రభుత్వం ఈ కంపెనీకి కాపులుప్పాడలో 21.33 ఎకరాలను కేటాయించింది. రూ.1,583 కోట్లతో కార్యాలయ నిర్మాణం, 8వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం.


