News October 27, 2024

ఐదేళ్లలో కోహ్లీ చేసింది 2 సెంచరీలే: ఆకాశ్ చోప్రా

image

విరాట్ కోహ్లీ ఫామ్‌పై భారత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా విమర్శలు కురిపించారు. ‘టెస్టుల్లో విరాట్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. గడచిన ఐదేళ్లలో 2 సెంచరీలు మాత్రమే చేశారు. సగటు చూస్తే 2020లో 19, 2021లో 28, 2022లో 26గా ఉంది. గత ఏడాది రెండు సెంచరీలు చేసినా అందులో ఒకటి అహ్మదాబాద్‌లోని నిర్జీవమైన పిచ్‌పై వచ్చింది. ఇక ఈ ఏడాది 8 ఇన్నింగ్స్ ఆడినా సగటు 32గానే ఉంది’ అని పెదవి విరిచారు.

Similar News

News November 21, 2025

RGM: జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య

image

GDK గౌతమీ నగర్‌కు చెందిన తిరువీధి శ్యాముల్ కిరణ్ (21) సమీపంలోని రైల్వే ట్రాక్ గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు NTPC SI ఉదయ్ కిరణ్ శుక్రవారం తెలిపారు. ITI చదువుతున్న అతడు చదువు మధ్యలో మానేయడంతో తల్లిదండ్రులు మందలించారు. జీవితంపై విరక్తిచెంది నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి శుక్రవారం గౌతమీనగర్ ట్రాక్‌పై విగతజీవిగా పడి ఉన్నాడు. తండ్రి కొండలరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 21, 2025

రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News November 21, 2025

రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.