News October 28, 2024
కోహ్లీ దేశవాళి క్రికెట్ ఆడాలి: DK
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రాణించలేకపోవడంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్ బాల్ ఫార్మాట్లో ఫామ్ను పొందేందుకు కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడడం బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్పిన్ బౌలింగ్ను కోహ్లీ ఎదుర్కోలేకపోవడంతో ఆయన ఈ సజెషన్ ఇచ్చారు. భారత్ 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై సిరీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News October 28, 2024
పార్టీలపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం
TG: వందల మంది వచ్చి మద్యం తాగాల్సిన పరిస్థితుల్లో ఎక్సైజ్శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒకరిద్దరి విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి మద్యపాన నిషేధం లేదని, దావత్లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్హౌస్లో ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News October 28, 2024
ఓబీసీలను మోదీ వంచించారు: కాంగ్రెస్
కులగణనకు అంగీకరించకుండా OBCలను ప్రధాని మోదీ వంచించారని కాంగ్రెస్ విమర్శించింది. వచ్చే ఏడాది జనగణనకు సిద్ధమైన కేంద్రం కులగణనను విస్మరించడాన్ని ప్రధాన విపక్షం తప్పుబట్టింది. ఈ విషయంలో NDA ప్రభుత్వాన్ని ఆపుతున్నదేంటని ప్రశ్నించింది. మోదీ తన రాజకీయ అహంకారంతో కులగణనను పక్కనపెట్టారంది. దీనిపై NDA మిత్రపక్షాలైన JDU, TDPల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేసింది.
News October 28, 2024
చైతూ-శోభితపై కామెంట్స్ చేసిన వేణుస్వామికి షాక్
నాగచైతన్య – శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామికి TG హైకోర్టు షాక్ ఇచ్చింది. వారంలోగా ఈ కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ను న్యాయస్థానం ఆదేశించింది. వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణకు హాజరుకావాలని గతంలో మహిళా కమిషన్ ఆదేశించింది. ఈక్రమంలో ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది.