News December 14, 2024
నేడు అరుదైన ఫీట్ అందుకోనున్న కోహ్లీ

విరాట్ కోహ్లీ నేడు ఆస్ట్రేలియాతో జరగనున్న 3వ టెస్టులో అరుదైన ఫీట్ అందుకోనున్నారు. వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో కలిపి ఆ జట్టుపై 100వ మ్యాచ్ ఆడనున్నారు. ఇప్పటి వరకు అతను ఆస్ట్రేలియాపై 49 వన్డేలు, 23 టీ20లు, 27 టెస్టులు ఆడి 5,326 రన్స్ చేశారు. వీటిలో 17 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 186. కోహ్లీ కంటే ముందు ఆస్ట్రేలియాతో 100 మ్యాచుల ఆడిన జాబితాలో సచిన్(110M, 6,707రన్స్) ఉన్నారు.
Similar News
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


