News December 14, 2024

నేడు అరుదైన ఫీట్ అందుకోనున్న కోహ్లీ

image

విరాట్ కోహ్లీ నేడు ఆస్ట్రేలియాతో జరగనున్న 3వ టెస్టులో అరుదైన ఫీట్ అందుకోనున్నారు. వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో కలిపి ఆ జట్టుపై 100వ మ్యాచ్ ఆడనున్నారు. ఇప్పటి వరకు అతను ఆస్ట్రేలియాపై 49 వన్డేలు, 23 టీ20లు, 27 టెస్టులు ఆడి 5,326 రన్స్ చేశారు. వీటిలో 17 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 186. కోహ్లీ కంటే ముందు ఆస్ట్రేలియాతో 100 మ్యాచుల ఆడిన జాబితాలో సచిన్(110M, 6,707రన్స్) ఉన్నారు.

Similar News

News December 4, 2025

27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం

image

HYDలో భూమి బంగారమైందంటే ఇదేనేమో. కోకాపేట నియోపొలిస్‌లో ప్రభుత్వం 27 ఎకరాలు విక్రయిస్తే ఏకంగా రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ మూడో విడత వేలంలో ప్లాట్ నంబర్ 19లో ఎకరం రూ.131 కోట్లు, 20లో ఎకరం రూ.118 కోట్లు పలికింది. మొత్తం 8.04 ఎకరాలను వేలం వేయగా HMDAకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు రెండు వేలం పాటల్లో రూ.2,700 కోట్లు వచ్చాయి. రికార్డు స్థాయిలో ఎకరం రూ.150 కోట్లకు పైగా పలికింది.

News December 4, 2025

భారత్ ఓటమికి కారణమిదే..

image

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ <<18462441>>ఓటమికి<<>> చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగే కారణం. మార్క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడు సెంచరీతో చెలరేగాడు. ప్రసిద్ధ్ 8.2 ఓవర్లకు 82, కుల్దీప్ 10 ఓవర్లకు 78, హర్షిత్ 10 ఓవర్లకు 70 రన్స్ సమర్పించుకోవడం భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. ఇక ఇలాంటి ఫీల్డింగ్‌తో 400 కొట్టినా కాపాడుకోలేమని క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

News December 4, 2025

సీఎం చంద్రబాబుతో అదానీ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ పోర్ట్స్&SEZ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అదానీ గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు. ఈ మీటింగ్‌లో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.