News October 30, 2024

ఆర్సీబీకి మళ్లీ కెప్టెన్ కానున్న కోహ్లీ?

image

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ జట్టుకు మళ్లీ కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన జట్టు మేనేజ్‌మెంట్‌కు సమాచారమిచ్చినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. 2022 నుంచి ఆ జట్టుకు డు ప్లెసిస్ కెప్టెన్సీ చేస్తున్నారు. కెప్టెన్లు మారుతున్నా కప్పు కొట్టడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో మరోసారి తానే కెప్టెన్‌గా కప్పుకోసం ట్రై చేయాలని కోహ్లీ భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 5, 2025

FLASH: ఏసీబీకి చిక్కిన HNK అడిషనల్ కలెక్టర్

image

హనుమకొండ అదనపు కలెక్టర్, జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన రూ.60,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించి ఈ లంచం తీసుకున్నట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు మరో ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

News December 5, 2025

డే అండ్ నైట్ టెస్టుల్లో WORLD RECORD

image

ఆసీస్-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండో టెస్టు రెండో రోజు ఇరు జట్లు 7 వికెట్లు కోల్పోయి 387 రన్స్(Aus-378/6, Eng-9/1) చేశాయి. డే అండ్ నైట్ టెస్టుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 2019లో AUS-PAK 383/8 స్కోర్ చేశాయి. అలాగే ఇవాళ ఆసీస్ చేసిన 378 పరుగులు.. DN టెస్టులో ఒక టీమ్ ఒక రోజులో చేసిన అత్యధిక స్కోర్ కావడం విశేషం.

News December 5, 2025

పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: పవన్

image

AP: సినిమాలు వినోదంలో ఓ భాగం మాత్రమేనని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. పిల్లలు ఆ సినిమాల పిచ్చిలో పడకుండా చూడాలని PTMలో పేరెంట్స్‌కి సూచించారు. గతంలో చదువుల కోసం దాతలు వందల ఎకరాలు దానమిచ్చారని గుర్తు చేశారు. నేడు ఉన్న స్థలాలు దోచుకుపోయే పరిస్థితి ఉందని, స్కూళ్లకు గ్రౌండ్స్ లేకపోవడం విచారకరమన్నారు. ‘సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు నా గుండెలో నాటుకుపోయాయి. అవే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి’ అని అన్నారు.