News April 13, 2024
జైపూర్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహం

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం లభించింది. జైపూర్లోని మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నెల 18న వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కింగ్ కోహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోనూ కోహ్లీ మైనపు విగ్రహం ఉంది.
Similar News
News January 22, 2026
WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అధికారికంగా వైదొలిగేందుకు అమెరికా సిద్ధమైంది. ట్రంప్ 2025లో పదవిలోకి వచ్చిన తొలి రోజే ఈ విషయాన్ని ప్రకటించారు. WHO నిధుల్లో సుమారు 18% USAనే ఫండింగ్ ఇచ్చేది. అమెరికా వెళ్లిపోతే ఆ సంస్థకి భారీ ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ ఇవ్వాల్సిన బకాయిలు ($260M) చెల్లించకుండానే US నిష్క్రమిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
News January 22, 2026
260 మృతి ఘటన.. సంచలన రిపోర్ట్!

అహ్మదాబాద్లో గతేడాది కుప్పకూలి 260 మంది మృతికి కారణమైన ఎయిరిండియా బోయింగ్ 787కు సంబంధించి USకు చెందిన ఓ NGO సంచలన విషయాలు వెల్లడించింది. BBC కథనం ప్రకారం.. 2014లో సర్వీసులో చేరిన ఆ విమానంలో తొలిరోజు నుంచే సమస్యలు తలెత్తినట్లు అక్కడి సెనేట్కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇంజినీరింగ్, తయారీ, క్వాలిటీ, నిర్వహణ లోపాల వల్లే ఇవి తలెత్తినట్లు ఇంటర్నల్ డాక్యుమెంట్లలో గుర్తించామని తెలిపింది.
News January 22, 2026
Republic day Special: మేడం బికాజీ కామా

బొంబాయిలో పార్శీ కుటుంబంలో జన్మించిన బికాజీ కామా దాదాభాయ్ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల ప్రేరణతో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి చికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడ భారతదేశ విప్లవకారులకు మార్గదర్శిగా మారారు. ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ని స్థాపించారు. ‘వందేమాతరం’ పత్రికను నడిపారు. 1907లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈమెను ‘భారత విప్లవకారుల మాత’గా అభివర్ణిస్తారు.


