News December 21, 2024
కోహ్లీ అలా చేస్తే ఫామ్ అందుకుంటారు: బంగర్

ఫామ్ అందుకోవాలంటే విరాట్ కోహ్లీ క్రీజులో ఎక్కువ సేపు ఉండాలని భారత మాజీ కోచ్ సంజయ్ బంగర్ సూచించారు. ‘బంతిని వేటాడకుండా దాన్ని తన వద్దకు రానివ్వాలి. క్రీజులో నిలదొక్కుకుంటే ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చాలా సులువవుతుంది. విరాట్ త్వరపడుతున్నారు. తర్వాతి టెస్టులో ఆయన వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడాలి. టైమ్ తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. గడచిన 5 ఇన్నింగ్స్లలో విరాట్ 126 పరుగులు మాత్రమే చేశారు.
Similar News
News November 12, 2025
తొలి టెస్టులో పంత్, జురెల్ ఆడవచ్చేమో: డస్కాటే

ఈ నెల 14 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టులో పంత్, జురెల్ ఇద్దరూ ఆడే అవకాశం ఉందని IND అసిస్టెంట్ కోచ్ డస్కాటే వెల్లడించారు. ఇలా జరగకపోతే ఆశ్చర్యపోవాల్సిన విషయమేనన్నారు. ఇటీవల SA-Aతో జరిగిన అనధికార టెస్టులో జురెల్ <<18235138>>రెండు సెంచరీలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు కీపర్లలో ఒకరిని బ్యాటర్గా ఆడించనున్నట్లు తెలుస్తోంది. అటు ఆల్రౌండర్ నితీశ్కు ఆడే అవకాశం రాకపోవచ్చని డస్కాటే పేర్కొన్నారు.
News November 12, 2025
పిల్లలు ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారా?

బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా కూర్చొనే సమయం పెరుగుతున్నకొద్దీ గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పు రెండింతలు ఎక్కువవుతోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
News November 12, 2025
టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్గా మారిన ధర్మారెడ్డి?

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి అప్రూవర్గా మారినట్లు తెలుస్తోంది. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు ఆయన అంగీకరించారని సమాచారం. CBI సిట్కు ఇచ్చిన వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది.


