News June 28, 2024

KOHLI: తుది పోరులోనైనా మెరుస్తారా?

image

టీ20 WCలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యం చెందుతున్నారు. టోర్నీలో ఇప్పటివరకు ఆయన 75 పరుగులు మాత్రమే చేశారు. కానీ కోహ్లీ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ ప్రకటించారు. ఫైనల్‌లో ఆయన నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తున్నట్లు తెలిపారు. పొట్టి కప్పు సమరంలో విరాట్ 1, 4, 0, 24, 37, 0, 9 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ఆయన ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Similar News

News December 7, 2025

ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు

image

ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులకు నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. USSD ఆధారిత ఫీచర్ ద్వారా నెట్ లేకున్నా, మారుమూల ప్రాంతాల నుంచి చెల్లింపులు చేయొచ్చు. అయితే ముందుగా బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌తో ‘*99#’కి డయల్ చేసి ఆఫ్‌లైన్ UPIని పొందాలి. ఆపై USSD ఫీచర్‌తో చెల్లింపులు చేయాలి. దేశంలో 83 BANKS, 4 టెలి ప్రొవైడర్ల నుంచి ఈ అవకాశం అందుబాటులో ఉంది.

News December 7, 2025

ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు.. సీఎం నిర్ణయం

image

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్ వినూత్న ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను HYD ప్రధాన రోడ్లకు పెట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’, అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేర్లను పెట్టనున్నారు. అలాగే పలు కీలక రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను పరిశీలిస్తున్నారు.

News December 7, 2025

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే

image

చిన్నస్వామి స్టేడియం నుంచి IPL మ్యాచ్‌లను తరలించడానికి అనుమతించేది లేదని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘ఇది కర్ణాటక, బెంగళూరు గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా చూస్తాం. కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తాం’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది విజయోత్సవ ర్యాలీలో 11 మంది చనిపోయిన నేపథ్యంలో IPL మ్యాచ్‌లను పుణేకు షిఫ్ట్ చేసేందుకు RCB <<18265735>>ప్రయత్నిస్తోంది.<<>>