News July 5, 2024
చిన్ననాటి కోచ్తో కోహ్లీ.. ఫొటోలు వైరల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164111524-normal-WIFI.webp)
ముంబైలో టీ20 వరల్డ్కప్ సెలబ్రేషన్స్ తర్వాత విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను రాజ్కుమార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘విరాట్.. నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ నుంచి ఇంత గొప్ప సక్సెస్ సాధించే వరకూ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు ఇలాగే విజయవంతంగా కొనసాగాలి’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Similar News
News July 8, 2024
శ్మశానంలో సమాధులకు సినిమాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720424633539-normal-WIFI.webp)
థాయ్లాండ్లోని ఓ శ్మశానవాటికలో సమాధుల వద్ద కుర్చీలు వేసి సినిమాలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్లోని ఓ శ్మశానవాటికలో సినిమాలు వేశారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. JUNE 2-6 మధ్య ఇది జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా పూర్వీకుల ఆత్మల శాంతి కోసమే ఈ ప్రయత్నమని వారు చెబుతున్నారు. అదే దేశంలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయిన తన ప్రేయసిని వివాహం చేసుకోవడం గమనార్హం.
News July 8, 2024
కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలు లేవనెత్తుతాం: పురందీశ్వరి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720426942678-normal-WIFI.webp)
AP: కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలను లేవనెత్తుతామని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు NDA పదేళ్ల పాలనలో దేశంలో అద్భుత ప్రగతి ఉందన్నారు. వికసిత్ భారత్, ఆత్మనిర్బర్ భారత్కు ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.
News July 8, 2024
వ్యవసాయ రుణాల టార్గెట్ పెంచనున్న కేంద్రం?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720424307032-normal-WIFI.webp)
వ్యవసాయ రుణాల టార్గెట్ను 25% పెంచి ₹25లక్షల కోట్లకు చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పెంపు పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ గణాంకాలపై ఆధారపడి ఉంటుందని కేంద్ర వర్గాలు తెలిపాయి. FY24లో సాగు రుణాల టార్గెట్ ₹20లక్షల కోట్లు ఉండగా, క్షేత్రస్థాయిలో రుణాల మంజూరు (₹24.84లక్షల కోట్లు) ఆ టార్గెట్ను అధిగమించింది.