News November 20, 2024

కోహ్లీ ఆట చూడాలని ఉంది: అక్తర్

image

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు యావత్ పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తెలిపారు. కోహ్లీ తొలిసారి పాక్ గడ్డపై అడుగుపెట్టాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘విరాట్ పాక్ గడ్డపై సెంచరీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించలేం. ఇక్కడ ఆడితే ఆయన క్రికెట్ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు చివరి క్షణంలోనైనా భారత్ ఇక్కడికి వస్తుందేమో చూడాలి’ అంటూ పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

రూ.కోట్లు కుమ్మరించినా చుక్క వర్షం పడలేదు

image

కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) ఫ్లాప్ అయింది. ఇప్పటివరకు 3 ట్రయల్స్ నిర్వహించగా చుక్క వర్షం కూడా కురవలేదు. ఒక్కో ట్రయల్‌కి రూ.35.67 లక్షల చొప్పున రూ.1.07 కోట్లు ఖర్చయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 9 ట్రయల్స్ కోసం ప్రభుత్వం రూ.3.21 కోట్లు కేటాయించింది. లో సక్సెస్ రేట్ ఉన్న ఈ విధానానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలొస్తున్నాయి.

News October 31, 2025

వాడని సిమ్స్‌ను డియాక్టివేట్ చేయండిలా!

image

చాలామంది ప్రస్తుతం ఒక సిమ్ మాత్రమే వాడుతున్నా ఆధార్ కార్డుపై ఎక్కువ సిమ్స్ యాక్టివ్‌లో ఉంటున్నాయి. ఇలాంటి అనవసరమైన సిమ్ కార్డులను డియాక్టివేట్ చేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్‌పై ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకొని, వాటిని క్యాన్సిల్ చేసేందుకు ‘TAFCOP’ పోర్టల్‌ అందుబాటులో ఉంది. మొబైల్ నం. & ఆధార్‌తో లాగిన్ అయి సిమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అనవసరమైన వాటి డియాక్టివేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు.

News October 31, 2025

CSల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

వీధికుక్కల కేసులో అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల CSలు సోమవారం ఫిజికల్‌గా హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్చువల్ హాజరుకు అనుమతించాలని SG కోరగా తిరస్కరించింది. GOVT, MNPలు పరిష్కరించాల్సిన అంశాలపై కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది. TG, DL, WB మినహా ఇతరులు అఫిడవిట్లు ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.