News August 17, 2024

కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు మాజీ ప్రిన్సిపల్

image

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరమైంది. ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యసిబ్బంది ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Similar News

News February 3, 2026

మోహన్ బాబు, విష్ణుపై కిడ్నాప్ కేసు

image

AP: మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మోహన్‌బాబు, విష్ణు, వర్సిటీ పీఆర్వోపై తిరుచానూరు పీఎస్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి నాయకులపై అక్కడి సిబ్బంది దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు సమాచారం.

News February 3, 2026

‘భోలే బాబా’ను తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి: సత్యకుమార్

image

AP: పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసేలా రూల్స్ మార్చి YCP బరి తెగించిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘TTD నెయ్యి కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదని YCP అంటోంది. అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? కల్తీ అయిందని జగన్ హయాంలో CFTRI తేల్చినా పట్టించుకోలేదు. భోలేబాబా డెయిరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి.’ అని పేర్కొన్నారు. CMగా జగన్ అన్యమతస్థులను TTDలో నియమించారని విమర్శించారు.

News February 3, 2026

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

image

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ(<>WDCW<<>>) కర్నూలు 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. PT ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, హౌస్ కీపర్, ఆయా పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ/డిప్లొమా(ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్), టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in