News August 25, 2024
కోల్కతా ఘటన.. నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్ పూర్తి

కోల్కతాలో వైద్యురాలి హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు పాలీగ్రాఫ్ పరీక్షలు పూర్తయ్యాయి. జైల్లోనే అతనికి లై డిటెక్టర్ టెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులకు సీబీఐ ఆఫీసులో పరీక్షలు నిర్వహించారు. నిందితులు ఏం చెప్పారనేది గోప్యంగా ఉంచారు. RG కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న మరో ఐదుగురికి నిన్న లై డిటెక్టర్ టెస్టులు చేశారు.
Similar News
News September 17, 2025
ఒక్క మండలంలోనే 3 వేల బోగస్ పట్టాలు.. ‘భరోసా’ బంద్

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్టు సర్వేతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నల్గొండ(D) తిరుమలగిరి(M)లో 3 వేల బోగస్ పట్టాలను అధికారులు గుర్తించి రద్దు చేశారు. ఆయా భూములకు సంబంధించిన అక్రమ లబ్ధిదారులకు రైతు బీమా, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలను నిలిపేశారు. దీనిపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అర్హులైన 4 వేల మందికి త్వరలో కొత్త పట్టాలిస్తామని ప్రకటించారు.
News September 17, 2025
ప్రధానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము PM మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’ అని ఆకాంక్షించారు. ‘సరైన సమయంలో సరైన నాయకత్వం దొరకడం మన అదృష్టం. ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేలా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’ అని CM చంద్రబాబు ట్వీట్ చేశారు. Dy.CM పవన్, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్ కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<