News June 12, 2024
కొల్లు రవీంద్ర రాజకీయ ప్రస్థానమిదే

* 2005లో రాజకీయ ప్రవేశం
* తొలుత TDP డివిజన్ అధ్యక్షుడు, 2007లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు
* 2009లో మచిలీపట్నం నుంచి ఓటమి
* 2014లో ఎమ్మెల్యేగా ఎన్నిక.. ఎక్సైజ్, చేనేత, బీసీ సంక్షేమం, సాధికారిత శాఖల మంత్రిగా విధులు
* 2017లో న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువత, క్రీడల, నిరుద్యోగ, ఎన్ఆర్ఐ శాఖల మంత్రిగా బాధ్యతలు
* 2019 ఎన్నికల్లో ఓటమి
* 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం.. కేబినెట్లో చోటు
Similar News
News September 12, 2025
డయేరియాతో ఎవరూ మరణించలేదు: మంత్రి సత్యకుమార్

AP: విజయవాడలో ఇప్పటివరకు 141 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ వ్యాధితో నగరంలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు. న్యూరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ, MP చిన్నితో కలిసి ఆయన పరామర్శించారు. ‘ఇంటింటి సర్వే చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. బుడమేరు ప్రాంతంలోని భూగర్భజలాలు కలుషితం అయ్యాయేమోనన్న అనుమానం ఉంది’ అని వ్యాఖ్యానించారు.
News September 12, 2025
రెడ్లైట్ థెరపీ గురించి తెలుసా?

రెడ్లైట్ థెరపీ శరీర సౌందర్యం పెంచే ఓ వైద్య పద్ధతి. గాయాలు మానడానికి, చర్మంపై ముడతలు, మచ్చలు, గీతలు తొలగించడానికి ఈ చికిత్సను ఉపయోగిస్తారు. వృద్ధాప్యంతో వచ్చే చర్మ సంబంధిత సమస్యలనూ ఈ థెరపీ ద్వారా నయం చేస్తారు. ఈ థెరపీ కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీన్ని మొటిమలు, చర్మ క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మంలో కొల్లాజెన్ను పెంచుతుంది. దీంతో చర్మంపై ముడతలు తగ్గుతాయి.
News September 12, 2025
పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.