News December 30, 2024

కోమటిరెడ్డికి ఆ అర్హత లేదు: వినోద్ కుమార్

image

TG: బీఆర్ఎస్ సర్కారు చేసిన మంచి పనుల్ని విమర్శించే అర్హత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేదని ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తాజాగా తేల్చిచెప్పారు. ‘మా అధినేత కేసీఆర్ చాలా ముందుచూపుతో రీజినల్ రింగ్ రోడ్ ఆలోచన చేశారు. నగరానికి వచ్చే పది హైవేలను అనుసంధానించేలా అలైన్‌మెంట్ రూపొందించారు. దీనిపై జాతీయ హైవేల అధికారులతోనూ చర్చించారు. మా ప్రభుత్వం అభివృద్ధి చేయలేదనడం సరికాదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 17, 2025

సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు ₹5 లక్షల పరిహారం

image

TG: సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున పరిహారం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్, MIM MLA, మైనారిటీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధుల బృందాన్ని ప్రభుత్వం సౌదీకి పంపించనుంది. మృతుల భౌతిక కాయాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు జరిపించనుంది. బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను CM ఆదేశించారు.

News November 17, 2025

పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగుతో లాభాలు

image

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.

News November 17, 2025

పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగుతో లాభాలు

image

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.