News July 30, 2024
లోక్సభలో బీజేపీ విప్గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి

TG: లోక్సభలో బీజేపీ విప్గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. ఆయనతోపాటు మరో 16 మందిని విప్లుగా ఎంపిక చేసింది. ఆ పార్టీ చీఫ్ విప్గా పశ్చిమ్ చంపారన్ ఎంపీ సంజయ్ జైస్వాల్ను నియమించింది. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సెక్రటరీ శివ్ శక్తినాథ్ బక్షి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందించారు.
Similar News
News November 17, 2025
చలి తీవ్రత.. 10 జిల్లాలకు అలర్ట్!

TG: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్(D) సిర్పూర్లో 7.4 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే 3రోజులు చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ADB, వికారాబాద్, MDK, నిర్మల్, BPL, మంచిర్యాల, WGL, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో టెంపరేచర్లు 7-11 డిగ్రీల మధ్య నమోదవుతాయని చెప్పింది.
News November 17, 2025
బస్సులో నన్ను అసభ్యంగా తాకాడు: మంచు లక్ష్మి

తనకు 15 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేనెప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించేదాన్ని. హాల్ టికెట్ల కోసం ఓసారి స్కూల్ యాజమాన్యం పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకడంతో షాకయ్యాను. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే అలాంటి పరిస్థితి ఎదురైంది. బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటారు కానీ బయటకు చెప్పుకోలేరు’ అని తెలిపారు.
News November 17, 2025
కోళ్లకు టీకా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్లలో ప్రాణాంతక వ్యాధులను అధిగమించేందుకు కోడిపిల్లల స్థాయి నుంచే సమయానుగుణంగా టీకాలు వేయించాల్సి ఉంటుంది. అయితే ఈ టీకాలు కోళ్లకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా మందులను ఎప్పుడూ ఐస్ లేదా ఫ్రిజ్లో నిల్వ ఉంచి ఉపయోగించాలి. కోళ్లకు ఇతర రోగాలు ఉన్నపుడు టీకాలు వేయకూడదు. కోళ్లు అస్వస్థతకు గురైనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు. టీకాలను పగలు కంటే రాత్రివేళల్లో వేయడం మంచిది.


