News June 4, 2024

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యం

image

చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 3,773 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 3,214 ఓట్లు పడ్డాయి.

Similar News

News November 15, 2025

ఈ ఊరి ప్రజలు తిరుమలకు వెళ్లరు.. ఎందుకంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోని ఓ ఊరు ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లా(TG) మల్దకల్‌ ప్రజలు తిరుమలకు వెళ్లరు. దీనికి కారణం ఆ ఊరిలోనే వెలసిన స్వయంభు లక్ష్మీవేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) ఆలయం. తమ స్థానిక దైవమైన తిమ్మప్పనే తిరుమలేశుడిగా భావించి పూజిస్తారు. ఇక్కడ ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి రోజున తిరునాళ్లు నిర్వహిస్తారు. ప్రజలు తమ ఇళ్లను ఆలయ గోపురం కంటే ఎత్తుగా నిర్మించరు.

News November 15, 2025

పోలీస్ స్టేషన్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర?

image

జమ్మూకశ్మీర్ నౌగామ్ <<18292633>>పోలీస్ స్టేషన్‌<<>>లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ PAFF ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర కూడా ఉందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ కేసు దర్యాప్తు చేస్తుండగానే ఈ పేలుడు సంభవించినట్లు J&K పోలీసులు ప్రకటించారు. కానీ, ఉగ్రకోణం అనుమానాలను కొట్టిపారేయకుండా ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించారు.

News November 15, 2025

ప్రభాస్- డాన్స్ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ కాంబోలో మూవీ?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో ఫౌజీ, స్పిరిట్, సలార్& కల్కి సీక్వెల్స్ ఉండగా మరో సినిమాకు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ డైరెక్టర్‌గా మారనున్నారని, ఆయన చెప్పిన కథను ప్రభాస్ ఓకే చేసినట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రభాస్ ‘రాజాసాబ్’ వచ్చే Jan-9న విడుదలవనుంది.