News March 18, 2024

కోరుట్ల: చేపలు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన చిన్నరాయుడు(30) ఆదివారం గ్రామ శివారులోని వాగు పరివాహక ప్రాంతంలో చేపలు పెట్టేందుకు వెళ్ళాడు. ఈక్రమంలో వ్యవసాయ మోటార్‌కు ఉన్న విద్యుత్ తీగను నీటి గుంతలో వేసి బండరాయిపై కూర్చుని చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారీ నీటిలో పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

Similar News

News January 25, 2026

KNR: పారదర్శకంగా ఇసుక విక్రయాలు.. అక్రమ రవాణాపై ఉక్కుపాదం!

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో TGMDC MD భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ఇకపై ఇసుక బుకింగ్‌ను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, CP గౌస్ ఆలం సమక్షంలో తహశీల్దార్లకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నిఘాపెంచి, అక్రమాలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సరఫరా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

News January 25, 2026

KNR: ‘విద్యార్థులను తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశం’

image

కరీంనగర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన టెడ్ టాక్స్‌తో నిర్వహించిన విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దడం జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశమని అన్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని తెలిపారు.

News January 25, 2026

KNR: ఆర్థిక ఇబ్బందులు.. తండ్రి ఆత్మహత్య!

image

ఉద్యోగాలు రాని కొడుకులు.. వసూలు కాని అప్పులతో మనస్తాపం చెందిన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్(D) మానకొండూరు మండలం అన్నారానికి చెందిన శంకరాచారి (58) శనివారం తేజాప్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొడుకులకు ఉద్యోగాలు రాకపోవడం, ఇచ్చిన అప్పుల వసూలుకావడం లేదనే బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.