News August 8, 2025

మర్డర్ కేసులో కోటా వినుతకు బెయిల్

image

AP: డ్రైవర్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత కోటా వినుతకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ చెన్నైలోని C3 సెవెన్ వెల్స్ పీఎస్‌లో సంతకం చేయాలనే షరతుతో మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా తన కారు డ్రైవర్‌ను కోటా వినుత భర్త చంద్రబాబుతో కలిసి చంపారనే ఆరోపణలతో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మద్రాస్ జైలుకు తరలించారు.

Similar News

News August 8, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల తక్షణ సాయం!

image

రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తారు. ఈ చికిత్స గరిష్ఠంగా 7 రోజుల వరకు వర్తిస్తుంది. మోటార్ వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా ఈ పథకానికి అర్హులే. SHARE IT

News August 8, 2025

బండి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో బండి సంజయ్ చేసిన <<17342231>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి KTR ఫైర్ అయ్యారు. ‘సంజయ్ స్టేట్‌మెంట్స్ హద్దు మీరాయి. హోంశాఖ మంత్రి అయినా ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందన్న ఇంగిత జ్ఞానం లేదని అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించాలని ఆయనకు సవాల్ విసురుతున్నా. 48 గంటల్లో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు పంపి కోర్టుకు లాగుతా’ అన్నారు.

News August 8, 2025

ప్రధాని మోదీకి చైనా స్వాగతం

image

ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO)లో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత PM మోదీకి చైనా స్వాగతం పలికింది. కాగా ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించనున్నారు. చివరిసారి 2018లో అక్కడికి వెళ్లారు. గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యం ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీటిని పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.