News March 3, 2025

KPHBలో నేపాల్ వాసి ఆత్మహత్య.. 

image

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. KPHB 4వ ఫేజ్‌లోని LIG 213/2లో నివాసముండే ప్రేమ రావల్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని నేపాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బతుకుదెరువు కోసం KPHBలో నివాసం ఉంటూ హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 

Similar News

News December 1, 2025

దూడల్లో నట్టల బెడద – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.

News December 1, 2025

NGKL:డాక్టర్ వెంకటదాస్ సేవలు మరువలేనివి

image

NGKL డివిజన్ డిప్యూటీ DMHOగా పనిచేసిన డాక్టర్ ఎం.వెంకటదాస్ సివిల్ సర్జన్ RMO పదోన్నతితో జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీపై వెళ్తుండడంతో, కలెక్టర్ బదావత్ సంతోష్ ఆయనను సత్కరించారు. ఆరోగ్య సూచికలు మెరుగుపరిచేందుకు వెంకటదాస్ సేవలు విశిష్టమైన DMHO డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యాచరణలో జిల్లా ముందంజలో ఉండడానికి ఆయన మార్గదర్శకత్వం ఎంతో విలువైందని అన్నారు.

News December 1, 2025

పదేళ్లలో రెట్టింపైన విదేశీ అప్పు: లోక్‌సభ

image

మన దేశ అప్పు ఊహించని విధంగా పెరుగుతూ పోతోంది. గత పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ, అప్పులపై లోక్‌సభలో వెల్లడించిన లెక్కలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. RBI ప్రకారం భారత విదేశీ రుణం దాదాపు రెట్టింపు అయ్యింది. 2015లో దేశ విదేశీ అప్పు రూ. 29,71,542 కోట్లుగా ఉంటే, 2025 జూన్ నాటికి అది రూ. 63,94,246 కోట్లకు చేరింది. అప్పులు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యుడి జీవన వ్యయం భారమవనుంది.