News February 21, 2025

KPHBలో యువకుడి మిస్సింగ్

image

ఇ‌న్‌స్టాలో పరిచయమైన మహిళతో యువకుడు వెళ్లి పోయిన ఘటన KPHB PS పరిధిలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. పవన్ అనే యువకుడు ఈనెల 6వ తేదీన ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. 2 రోజుల క్రితం తాను ఫోన్ చేసి అనారోగ్యంగా ఉందని పుణేలో తెలియని ప్రాంతంలో ఉన్నానని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు కాల్ చేయగా మహిళా ఫోన్ ఎత్తి ‘మీ కుమారుడికి కాల్ చేస్తే చంపేస్తా’అని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News February 21, 2025

HYD: దాడి కేసులో నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ

image

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. రంగరాజన్‌పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డికి పోలీసు కస్టడీ ముగిసింది. 3 రోజులపాటు కస్టడీలో పోలీసులు వీరరాఘవ రెడ్డిని విచారించారు. కస్టడీ ముగియడంతో నిందితుడిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి.. ఆపై చంచల్‌గూడ జైలుకి తరలించారు. కాగా.. నిందితుడు తెలుగు రాష్ట్రాల్లోని 6 ప్రధాన ఆలయాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

News February 21, 2025

షాద్‌నగర్: మమ్మల్ని తిడితే కృష్ణా నీళ్లు రావు: మాజీ ఎమ్మెల్యే

image

మాజీ మంత్రి హరీశ్‌రావు కృష్ణాజలాలపై ప్రశ్నిస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రపాలకులతో కలిసి కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్నారు. మమ్మల్ని తిడితే కృష్ణా నీళ్లు రావని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

News February 21, 2025

కీసర గుట్ట జాతర.. CM రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 24 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆధ్వర్యంలో CM రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. కాగా ఇప్పటికే గుడి వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

error: Content is protected !!