News April 2, 2025

KPHB: భర్త టార్చర్ భరించలేక భార్య సూసైడ్!

image

కట్టుకున్న భర్తే వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలోనీ 3వ ఫేజ్‌లో చోటుచేసుకుంది. రజనీకాంత్ రెడ్డి, సౌజన్యకు(29) 2020లో వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో 3 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 3, 2025

రంగారెడ్డి: FREE కోచింగ్.. అప్లయి చేసుకోండి

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. సీసీ కెమెరా కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19-45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, బ్యాంకు పాస్ బుక్, ఆధార్, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో ఈనెల 5లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
– SHARE IT.

News December 3, 2025

శ్రీకాంతాచారి చిరస్థాయిగా నిలిచిపోయాడు: కవిత

image

మలి దశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసిన ఆత్మబలిదానం రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ జ్వాలను మరింతగా రగిల్చిందని జాగృతి చీఫ్ కవిత అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ అమరుడి త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఎల్బీనగర్‌లోని విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడు శ్రీకాంతాచారి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

News December 3, 2025

కోర్టుకెక్కిన పేరూరు గ్రామ ‘పంచాయితీ’..!

image

నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం పేరూరులో ఎస్టీ మహిళ ఓటర్లు లేకున్నా గ్రామ సర్పంచ్, వార్డులు ఎస్టీ మహిళకి రిజర్వ్‌డ్ కావడంతో పంచాయతీ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా గ్రామంలో కేవలం ఒక్కరే ఎస్సీ అభ్యర్థి (పురుషుడు) ఉన్నారు. గ్రామ పంచాయతీలు 8 వార్డులు ఉండగా వాటిలో నాలుగు వార్డులు ఎస్టీకి రిజర్వ్‌డ్ చేశారు. ప్రస్తుతం ఈ పంచాయితీ కోర్టుకెక్కింది.