News April 2, 2025
KPHB: భర్త టార్చర్ భరించలేక భార్య సూసైడ్!

కట్టుకున్న భర్తే వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలోనీ 3వ ఫేజ్లో చోటుచేసుకుంది. రజనీకాంత్ రెడ్డి, సౌజన్యకు(29) 2020లో వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో 3 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 22, 2025
ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్లో 68వ ర్యాంకు

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్రావు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News April 22, 2025
ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్లో 68వ ర్యాంకు

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్రావు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News April 22, 2025
గొప్ప మనసు చాటుకున్న జగ్గారెడ్డి

క్యాన్సర్ బాధితురాలికి జగ్గారెడ్డి అండగా నిలిచారు. సదాశివపేటకు చెందిన ఆమని ఇంటికి వెళ్లిన ఆయన బాధితురాలిని పరామర్శించారు. చికిత్సకు రూ.7 లక్షల అప్పులు చేశానని.. భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని ఆమని విలపించింది. ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని వాపోయింది. బాధితురాలి గాథ విని జగ్గారెడ్డి తక్షణమే రూ.10 లక్షలు అందించారు.