News June 30, 2024

KPHB: రెండు వారాలకు మించి దగ్గు వస్తుందా?

image

KPHB పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారుల బృందం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. డాక్టర్ సంధ్య మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు వస్తే వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టెస్ట్ చేయించుకోవడం ఉత్తమమని సూచించారు. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీబీ టెస్ట్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 23, 2024

HYD: అక్రమ నల్లా కనెక్షన్ గుర్తిస్తే కాల్ చేయండి: MD

image

అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. HYD నగరంలో ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగించినట్లు గుర్తిస్తే విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు.

News September 23, 2024

చేవెళ్ల: రూ.38 కోట్లు విడుదల: ఎంపీ

image

స్వదేశీ అభియాన్ పథకం కింద రూ.99 కోట్లతో వికారాబాద్ అనంతగిరి కొండలను అభివృద్ది చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనిలో మొదటి దశలో రూ.38 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. శంకర్పల్లి, మర్పల్లి రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.400 కోట్లు నిధులు మంజూరు చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని అడుగుతానని తెలియజేశారు.

News September 23, 2024

గ్రేటర్ HYDలో RTC బస్‌పాస్ REPORT

image

2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ మంత్లీ బస్‌పాస్‌ కొద్ది రోజుల్లోనే 750 మంది కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. రూ.1450 విలువైన ఈ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ చెల్లుబాటు అవుతోంది. ప్రస్తుతం నగరంలో 10,000 మంది ఆర్డినరీ, 75,000 మంది మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ వినియోగిస్తున్నట్లుగా వెల్లడించారు.