News March 17, 2024

కృష్ణా: జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్ష

image

జిల్లాలో ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 స్క్రీనింగ్ ప‌రీక్ష ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజ‌య‌వాడ‌లో 24 కేంద్రాల్లో 10,526 మంది అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉద‌యం జ‌రిగిన పేప‌ర్‌-1కు 63.06 శాతం (6,638), మ‌ధ్యాహ్నం జ‌రిగిన పేప‌ర్‌-2కు 62.66 శాతం (6,596) మంది హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించారు.

Similar News

News January 19, 2026

కృష్ణా: SP పేరుతో ఫేక్ ఎకౌంట్లు.. సీరియస్ అయిన పోలీసులు

image

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేయడమే కాకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి డబ్బులు డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లా పోలీస్ శాఖ సీరియస్ అయింది. ఎస్పీ పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దని, ఎవరైనా డబ్బులు కావాలని మెసేజ్ చేసినా స్పందించవద్దని కోరింది. ఇటువంటి ఫేక్ ఐడీలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని DSP సీహెచ్ రాజా తెలిపారు.

News January 19, 2026

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News January 19, 2026

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.