News March 18, 2024

కృష్ణా: బీఈడీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, స్పెషల్ బీఈడీ 3వ సెమిస్టర్‌ థియరీ పరీక్షల 2020, 2021, 2022బ్యాచ్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 25నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News February 1, 2026

రేపు కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (PGRS) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు.

News February 1, 2026

కంకిపాడుకి చెందిన సినీ నటుడు రఘునాథ్ రెడ్డి మృతి

image

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కంకిపాడుకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. తెలుగు, హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల్లో దాదాపు 370కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. కొన్ని నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా గుండెపోటుతో మరణించగా, ఇప్పుడు రఘునాథ్ రెడ్డి మృతితో ఆ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.

News February 1, 2026

అవనిగడ్డ అమ్మాయికి గ్రూప్–2లో ఉద్యోగం

image

అవనిగడ్డకు చెందిన సుధారాణి గ్రూప్–2 పరీక్షలో సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలో తపాలా శాఖ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న ఆమె తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. స్థానిక పాఠశాలలో చదివిన సుధారాణి పదో తరగతిలో 10 పాయింట్లు సాధించారు. 2016లో గ్రామీణ డాక్ సేవక్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి, హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టు ఉమెన్‌గా పనిచేశారు.