News March 18, 2024
కృష్ణా: బీఈడీ విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, స్పెషల్ బీఈడీ 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల 2020, 2021, 2022బ్యాచ్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 25నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 9, 2026
కృష్ణా: వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలంటూ జేసీకి వినతి

వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని వైసీపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలార్ దాదా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వవద్దు అని, ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
News February 9, 2026
కృష్ణా: ‘ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి’

జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో RBI ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమన్నారు.
News February 9, 2026
కృష్ణా: ‘వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి’

జిల్లాలో వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ ప్రత్యేకంగా ముద్రించిన గోడ పత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.


