News March 18, 2024
కృష్ణా: బీఈడీ విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, స్పెషల్ బీఈడీ 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల 2020, 2021, 2022బ్యాచ్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 25నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 6, 2026
కృష్ణా: గ్రేట్.. అంధత్వాన్ని జయించి గ్రూప్-2 కొట్టి!

చల్లపల్లి(M) శివరాందుర్గాపురానికి చెందిన అంధ యువకుడు నాగరాజు అసాధారణ పట్టుదలతో గ్రూప్-2 విజేతగా నిలిచారు. 2010లో జరిగిన ప్రమాదంలో చూపు కోల్పోయినా అధైర్యపడకుండా, ఒంగోలు అంధుల పాఠశాలలో విద్యనభ్యసించి MA పూర్తి చేశారు. గ్రూప్-2 ఫలితాల్లో HOD విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికయ్యారు. గతంలో CM చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న ఆయన, భవిష్యత్తులో గెజిటెడ్ అధికారి కావడమే తన లక్ష్యమన్నారు.
News February 6, 2026
కృష్ణా: SSC పరీక్ష ఫీజు చెల్లింపునకు మరో అవకాశం

పదో తరగతి (SSC) విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ SSC ఎగ్జామినేషన్ బోర్డు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి గురువారం తెలిపారు. పరీక్ష ఫీజును ఇప్పటివరకు చెల్లించని విద్యార్థులు రూ.1000ల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఈ తత్కాల్ పథకం ఈనెల 6 నుంచి 12 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
News February 5, 2026
నేలపై కూర్చున్న కృష్ణాజిల్లా కలెక్టర్

మచిలీపట్నంలోని ఎస్ఎన్ గొల్లపాలెం పంచాయతీ పరిధిలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షర ఆంధ్ర (ఉల్లాస్)’ కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. అనంతరం ఆయన నేలపై కూర్చుని తరగతుల నిర్వహణ, హాజరు, బోధనా విధానాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. వయోజనులు చదువుతో స్వావలంబన సాధించాలన్నారు. అక్షరాస్యత కుటుంబం, సమాజ అభివృద్ధికి దోహదమని సూచించారు.


