News January 22, 2025
66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపిణీ

కృష్ణా జలాలు చెరి సగం పంపిణీ చేయాలన్న <<15215783>>తెలంగాణ <<>>ప్రతిపాదనను KRMB అంగీకరించలేదు. దీనిపై త్రిసభ్య కమిటీని నియమించనుంది. పాత ఒప్పందం 66:34 ప్రకారమే నీరు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 50:50 నిష్పత్తిలో నీటి కేటాయింపులను AP వ్యతిరేకించింది. అలాగే నీటి వాడకం లెక్కలూ తెలిసేలా టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న TG ప్రతిపాదననూ ఒప్పుకోలేదు. అటు ప్రధాన కార్యాలయం HYD నుంచి విజయవాడ తరలించేందుకు KRMB ఆమోదం తెలిపింది.
Similar News
News November 21, 2025
గుమ్మానికి నిమ్మ, మిరపకాయ ఎందుకు కడతారు?

ఇళ్లు, షాప్ గుమ్మాలకు, వాహనాలకు నిమ్మ, మిరపకాయలు కడుతుంటారు. ఇది చెడు దృష్టిని తొలగిస్తుందని నమ్మకం. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాల వాడకం పెంచేందుకే పూర్వీకులు ఈ పద్ధతిని ప్రోత్సహించారని అంటారు. ఇలా కడితే ఇంటి చుట్టూ ఉండే వాతావరణం శుభ్రమవుతుంది. వాహనాలకు వీటిని తగిలించడం వలన వీటిలోని సానుకూల శక్తి చుట్టూ ఉండే చెడు దృష్టిని తొలగించి, ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందని విశ్వాసం.
News November 21, 2025
ఓట్ల సవరణ ఆపండి.. ECకి మమతా బెనర్జీ లేఖ

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ను నిలిపివేయాలని CEC జ్ఞానేశ్ కుమార్కు బెంగాల్ CM మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘BLOలు పరిమితి దాటి పని చేస్తున్నారు. EC తీరు ఆమోదయోగ్యంగా లేదు. వారికి సపోర్టుగా నిలిచేది పోయి బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న SIRను ఆపాలని కోరుతున్నా. వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వండి. ప్లానింగ్ లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.
News November 21, 2025
మహిషి కన్నీరు కలిసిన జలం

శబరిమల యాత్రలో ముఖ్య ప్రాంతాల్లో ‘అళుదా నది’ ఒకటి. మహిషిని అయ్యప్ప స్వామి వధించిన స్థలం ఇదేనని ప్రతీతి. స్వామి బాణాలకు తాళలేక మహిషి రోదిస్తూ కన్నుమూశాడు. అప్పుడు కార్చిన కన్నీరు ఈ నదిలో కలిసిందట. అందుకే దీన్ని అళుదా(రోదించడం) నది అని అంటారు. అయ్యప్ప భక్తులు ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరించి, 2 రాళ్లను తీసుకొని, యాత్ర మార్గంలోని కల్లిడుకుండ్రుం వద్ద విసిరి తమ యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>


