News July 21, 2024
‘మురారి’ ఫ్లాప్ అంటూ ట్వీట్.. స్పందించిన కృష్ణవంశీ

మహేశ్ ‘మురారి’ ఫ్లాప్ అంటూ ఓ వెబ్సైట్కు చెందిన ట్విటర్ హ్యాండిల్ చేసిన ట్వీట్పై ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. ‘నేను మురారి ‘తూర్పుగోదావరి’ హక్కుల్ని నిర్మాత వద్ద రూ.55లక్షలకు కొన్నాను. రూ.1.30కోట్లు వచ్చాయి. సక్సెస్కు లాభాలే కొలమానమైతే ఆ సినిమా హిట్టో కాదో మీరే డిసైడ్ చేయండి’ అని పేర్కొన్నారు. రిప్లై ఇంకొంచెం ఘాటుగా ఇవ్వాల్సిందంటూ ఓ అభిమాని కోరగా తప్పని కృష్ణవంశీ వారించారు.
Similar News
News December 27, 2025
పబ్లిక్ ప్లేస్లో పావురాలకు మేత వేస్తున్నారా?

చాలామంది రోడ్లమీద, పార్కుల్లో పావురాలకు మేత వేస్తూ ఉంటారు. వాటి వల్ల అనారోగ్య <<15060184>>సమస్యలు<<>> వస్తాయని చెప్పినా లెక్కచేయరు. అయితే అలా చేసిన ఓ వ్యాపారికి ముంబై కోర్టు రూ.5వేలు ఫైన్ వేసింది. అతను చేసిన పనిని హ్యూమన్ లైఫ్, హెల్త్కి ముప్పుగా, ప్రాణాంతక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే చర్యగా పేర్కొంది. పావురాలతో మనకు ఎంత ప్రమాదం పొంచి ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News December 27, 2025
ఇంటర్వ్యూతో NAARMలో ఉద్యోగాలు

<
News December 27, 2025
ఒకేరోజు రూ.20 వేలు పెరిగిన వెండి ధర

ఇవాళ కూడా వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగింది. నిన్న KG వెండి రూ.9 వేలు పెరగ్గా ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.20వేలు పెరిగింది. దీంతో కిలో వెండి కాస్ట్ రూ.2,74,000కు చేరింది. 6 రోజుల్లోనే కిలో సిల్వర్ రేటు రూ.48వేలు పెరగడం గమనార్హం. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుతూనే ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.1,200 పెరిగి రూ.1,41,220కి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,100 పెరిగి రూ.1,29,450కి చేరింది.


