News July 16, 2024
AP, తెలంగాణకు నీటి కేటాయింపులు చేసిన KRMB

ఏపీ, తెలంగాణకు 9.914 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. APకి 4.500 TMCలు, TGకి 5.414 TMCల నీటిని శ్రీశైలం పవర్ హౌసెస్ ద్వారానే విడుదల చేయాలని బోర్డు స్పష్టం చేసింది.
Similar News
News January 18, 2026
అనంతపురం: 19న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనంతపురం జిల్లా ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఈనెల 19న కలెక్టరేట్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
News January 18, 2026
HEADLINES

* వందేభారత్ స్లీపర్ ప్రారంభించిన PM మోదీ
* బెంగాల్లో బీజేపీ రావాలి: PM మోదీ
* ఇరిగేషన్, ఎడ్యుకేషన్కే తొలి ప్రాధాన్యం: TG CM రేవంత్
* ప్రధాని అండతో అభివృద్ధిలో ముందుకెళ్తాం: AP CM CBN
* AP కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన
* రేవంత్ తుగ్లక్లా వ్యవహరిస్తున్నారు: KTR
* తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు
* JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
News January 18, 2026
భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారో తెలుసా?

ప్రపంచంలోనే ఎక్కువ సవరణలు జరిగింది భారత రాజ్యాంగంలోనే. 1949, NOV 26న రాజ్యాంగ సభ ఆమోదం పొంది 1950, JAN 26న అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటివరకు 106సార్లు సవరణలు చేశారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడాన్ని తప్పనిసరి చేస్తూ 2023 SEPలో చివరిగా సవరించారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల డీలిమిటేషన్స్ పూర్తైన తర్వాత రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.


