News March 23, 2024
KTDM:ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో తుపాకుల మోత మోగింది. పెడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి జవాన్లు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జవాన్లు గాలిస్తున్నారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: మొదటి విడత ఎన్నికకు 1,740 పోలింగ్ కేంద్రాలు

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 4, 2025
ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు
News December 4, 2025
ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు


