News March 20, 2024
KTDM:పోలీసుల ఎదుట శబరి ఏరియా మావోయిస్టు లొంగుబాటు

తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు చర్ల మండలం ఎర్రంపాడుకి చెందిన మడివి బుద్ర బుధవారం జిల్లా పోలీసులు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారులు సమక్షంలో లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇతనిపై రూ. 4లక్షల రివార్డు ఉందని, మావోయిస్ట్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక లొంగిపోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈసమావేశంలో సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 22, 2025
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతూ కొత్తగా నియమితులైన ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ప్రభుత్వ బీసీ స్డడీ సర్కిల్లో శిక్షణ తీసుకోని గ్రూప్-3, గ్రూప్-4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కలెక్టర్ను సోమవారం కలిశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు చేసేందుకు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
News December 22, 2025
48 గంటల్లోనే జీవో.. మాట నిలబెట్టుకున్న పొంగులేటి..!

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన TWJF మహాసభలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ విధివిధానాలపై 10 రోజుల్లో జీవో ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, ఆ గడువు అవసరం లేకుండానే కేవలం 48 గంటల్లోనే జీవో విడుదల చేయించి మంత్రి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.
News December 22, 2025
ఖమ్మం జిల్లాలో Dy.Cm పర్యటన షెడ్యూల్ ఇదే..!

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం పర్యటన షెడ్యూల్ వివరాలను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:35కు తల్లాడ (మం) పినపాకలో 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు సత్తుపల్లిలో సింగరేణి జీఎం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:30కు జీవీఆర్ ఓపెన్ కాస్ట్ మెయిన్-2ను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు.


